PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-studentsf4abfdb4-a9d5-40f1-9550-dac0f122120b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-studentsf4abfdb4-a9d5-40f1-9550-dac0f122120b-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ ఏపీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు నిర్వహించాల్సిందిగా సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఓ మెమో జారీ చేసింది. కోవిడ్ విస్తృతి కారణంగా ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకు ఒక్కపూట మాత్రమే పాఠశాలలు పని చేయాల్సిందిగా మెమోలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి రోజు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్ధులను ఇళ్లకుjagan-students;dr rajasekhar;jagan;andhra pradesh;telangana;minister;good news;june;good newwzవిద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. అయితే.. అది సగమే సుమా..?విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. అయితే.. అది సగమే సుమా..?jagan-students;dr rajasekhar;jagan;andhra pradesh;telangana;minister;good news;june;good newwzThu, 25 Mar 2021 06:00:00 GMTఏపీ సీఎం జగన్ ఏపీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు నిర్వహించాల్సిందిగా  సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఓ మెమో జారీ చేసింది. కోవిడ్ విస్తృతి కారణంగా ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకు ఒక్కపూట మాత్రమే పాఠశాలలు పని చేయాల్సిందిగా మెమోలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది.


ప్రతి రోజు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్ధులను ఇళ్లకు పంపాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.అన్ని పాఠశాలల్లో  కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. మే 31వ తేదీ నాటికి పదో తరగతి మినహా అన్ని తరగతులకు  పరీక్షలు నిర్వహాణ పూర్తి కావాలని ప్రభుత్వం సూచించింది. పదో తరగతి విద్యార్ధులకు షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి విద్యార్ధులకు పరీక్షల తో కలిపి జూన్ 15వ తేదీని ఆఖరు పనిదినంగా ప్రభుత్వం నిర్దారించింది.


కరోనా నేపథ్యంలో ఇది విద్యార్థులకు కాస్త ఊరటనిచ్చే వార్తగానే చెప్పాలి. అయితే ఇది సగం మాత్రమే ఊరట. ఎందుకంటే.. తెలంగాణలో ఇప్పటికే స్కూళ్లను  పూర్తిగా మూసేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్ళు, గురుకులాలు, హాస్టళ్లు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నిన్నటి నుంచే స్కూళ్లన్నీ బంద్ చేసేశారు.  వైద్య కళాశాలలు కాకుండా రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. అయితే తెలంగాణలో  ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి.




మార్చి 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>