Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli1c7a8189-98bd-4d1b-8f0c-6e95c6a8c3f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli1c7a8189-98bd-4d1b-8f0c-6e95c6a8c3f2-415x250-IndiaHerald.jpgటీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ ఇంగ్లండ్ మాజీలు మొదటి నుంచీ నోరు పారేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ దేశ మాజీలంతా టీమిండియాను విపరీతంగా విమర్శించడం మొదలు పెట్టారు. తాజాగా తొలి వన్డే ఓడిపోయిన తరువాత మరో సారి..virat kohli;virat kohli;bcci‘కోహ్లీ.. వాళ్లను గౌరవించడం నేర్చుకో..’‘కోహ్లీ.. వాళ్లను గౌరవించడం నేర్చుకో..’virat kohli;virat kohli;bcciThu, 25 Mar 2021 21:15:48 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ ఇంగ్లండ్ మాజీలు  మొదటి నుంచీ నోరు పారేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ దేశ మాజీలంతా టీమిండియాను విపరీతంగా విమర్శించడం మొదలు పెట్టారు. తాజాగా తొలి వన్డేలో తమ జట్టు ఓడిపోయిన తరువాత మరో సారి ఇంగ్లండ్ మాజీలు నోటికి పనిచెప్పారు. ఈ సారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంపైర్ల పట్ల కోహ్లీ వ్యవహరిస్తున్న తీరు ఆమోదయోగ్యం కాదని, బీసీసీఐ చేతకాని తనం వల్లే కోహ్లీ అలా రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. దానిని కచ్చితంగా కోహ్లీ మార్చుకోవాలని ఉచిత సలహాలిచ్చారు.
   
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ తాజాగా ఓ పత్రికకు రాసిన వ్యాసంలో కోహ్లీ వ్యవహారశైలిపై మండిపడ్డాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో సంయమనంతో వ్యవహరించాలని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కోహ్లీ ఇటు అంపైర్లు, ఆట ఆటగాళ్లతో తరచుగా వాగ్వాదాలకు దిగుతున్నాడని, అది అంత మంచిపద్దతి కాదని అన్నాడు. అలాగే అంపైర్లను ఆటగాళ్లు కచ్చితంగా గౌరవించాలని, కానీ కోహ్లీ వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని తనకు అనిపిస్తోందని లాయిడ్ విమర్శించాడు. ఈ విషయంలో కోహ్లీ మరింత పరిణితి సాధించాలని అన్నాడు.

`మైదానంలోని అంపైర్లపై కోహ్లీ ఒత్తిడి తెస్తున్నాడు. వారిని గౌరవించడం లేదు. మైదానంలో సంయమనంతో వ్యవహరించాలి. ప్రత్యర్థి ఆటగాళ్లతోనూ, అంపైర్లతోనూ కోహ్లీ తరచుగా వాగ్వాదాలకు దిగుతున్నాడు. కానీ టీమిండియాపై నోరు లేని ఐసీసీ ఏమీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. అందుకే కోహ్లీ ఎలా కావాలంటే అలా ఆడుతున్నాడ`ని లాయిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి ప్రవర్తన వల్ల మిగతా ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ తప్పే ప్రమాదముందని, ఇప్పటికైనా కోహ్లీని బీసీసీఐ నియంత్రించాలని, కోహ్లీ కూడా తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు.





మళ్లీ తెరపైకి భారత్-పాక్ క్రికెట్.. త్వరలో ఓ టోర్నీ!

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>