PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/modi-bjp-latest-news-breaking-newsa3fbaed8-1c26-438f-8e59-1307b21dc3cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/modi-bjp-latest-news-breaking-newsa3fbaed8-1c26-438f-8e59-1307b21dc3cd-415x250-IndiaHerald.jpgఆయ‌న మ‌నంద‌రి కోసం ఆలోచించే నేత‌.. ఆయ‌న త‌న‌కోసం ఎప్పుడూ ఆలోచించ‌రు.. తాను ఎంత పెద్ద ప‌ద‌విలోఉన్నాన‌నేది అన‌కు అన‌వ‌స‌ర‌మంటారు.. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసే భాగ్యం ల‌భించ‌డ‌మే పెద్ద ప‌ద‌వి అంటారు.. ప్ర‌జల మేలు.. ప్ర‌జ‌ల సౌభాగ్యం.. ప్ర‌జాభివృద్ధి... ఇలా నిరంత‌రం ప్ర‌జ‌ల‌కోసం ఆలోచించే ఆ మ‌హోన్న‌త వ్య‌క్తి త‌న గురించి తాను ఆలోచించ‌రు. కానీ మ‌న కోసం ఎంతో చేస్తున్న వ్య‌క్తికోసం మ‌నం ఆలోచించాలిక‌దా.modi, bjp, latest news, breaking news;modi;jeevitha rajaseskhar;tara;2020;central government;jioగ‌డ్డం చేయించుకోవ‌డానికి డ‌బ్బులు లేవుగ‌డ్డం చేయించుకోవ‌డానికి డ‌బ్బులు లేవుmodi, bjp, latest news, breaking news;modi;jeevitha rajaseskhar;tara;2020;central government;jioWed, 24 Mar 2021 07:41:00 GMT
స్మార్ట్ ఫోన్‌తో రాజీప‌డ్డారు
స్మార్ట్ ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత‌, జియో డేటా వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లు అన్నీ మ‌ర్చిపోయారు. దేశంలో స‌మ‌స్య‌లేమున్నాయోకూడా వారికి అర్థంకావ‌డంలేదు. గ‌తంలో చిన్న చిన్న విష‌యాల‌కే రోడ్లపైకి వచ్చి ప్రజలు ఆందోళన చేసే వారు. కానీ ఇప్పుడు మ‌న ప్ర‌ధాన‌మంత్రి సారు ప్ర‌తిరోజు తూకాల లెక్కన రేట్లు పెంచుతున్నారు. అయినా ఎవ‌రికీ ప‌ట్ట‌డంలేదు. మ‌న క‌ర్మ ఇంతేలే అని స్మార్ట్ ఫోను చూసుకుంటూ రాజీప‌డిపోతున్నారు. 2014లో అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు అన్నీ పెరిగిన‌వేకానీ ధ‌ర‌లు త‌గ్గిన‌వంటూ ఏవీ లేవు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాసే కాదు.. కిరోసిన్ కూడా పెరిగింది. నిత్యావ‌స‌రాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ర‌వాణా సౌక‌ర్యం త‌క్కువ ఖ‌ర్చుతో ఉన్న‌ప్పుడు స‌రుకుల స‌ర‌ఫ‌రా కూడా త‌క్క‌వ ధ‌ర‌కే జ‌రిగిన అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లోకి వ‌స్తాయి. ఈ చిన్న సూత్రం సారు‌కు తెలియ‌దా?  తెలుసు. కానీ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌లు పెరుగుతున్నాయి కాబ‌ట్టి పెంచుతున్నామ‌ని చెపుతారు. ప్ర‌త్యామ్నాయం గురించి ఆలోచించ‌రు.

ఆయ‌న‌ది సాధార‌ణ జీవితం
పార్ల‌మెంటులో ప్ర‌భుత్వం చెప్పిన‌దాని ప్ర‌కారం గ‌త ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి ఇంధనంపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 300% పెరిగింది. మోడీ మొదటి సంవత్సరం పాలన 2014-15లో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను రూ.29,279 కోట్లు. డీజిల్‌పై  42,881 కోట్లు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి పది నెలల్లో  2.94 లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చాయి. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఆలోచిస్తారు కాబ‌ట్టే ఈవిధంగా ప‌న్నులు పెంచారు. కానీ తాను మాత్రం ఎప్పుడూ సాధార‌ణంగానే ఉంటారు. క‌రోనా త‌ర్వాత ఎంత‌మంది ఆర్థిక స్థితిగ‌తులు తారుమ‌ర‌య్యాయో తెలుసుగా.. అందుకే వారికి మ‌ద్ద‌తుగా మోడీసారు గ‌డ్డం కూడా చేయించుకోవ‌డంలేదు.. గ‌డ్డం చేయించుకోవ‌డానికి కూడా డ‌బ్బ‌లులేని స్థితిలో ఉన్న పేద‌లకు ఆయ‌న ఈ విధంగా మ‌ద్ద‌తు తెలుసుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.




వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో న‌వ వ‌ధువులా ఆత్మ‌హ‌త్య‌.... ఆ కార‌ణం చేతే..

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>