PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-check-to-two-tdp-mlas-0b8a9dd0-f96e-4847-bf1b-8af90092dd52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-check-to-two-tdp-mlas-0b8a9dd0-f96e-4847-bf1b-8af90092dd52-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ హవా స్పష్టంగా నడుస్తోంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, అద్భుతమైన పాలనతో దూసుకెళుతున్న జగన్‌కు తిరుగులేని విజయాలు అందుతున్నాయి. అసలు జగన్ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకితతో ఉన్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో పస లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైపోయింది. ముందుగా పంచాయితీ ఎన్నికల్లో అదరగొట్టిన వైసీపీ, ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది. jagan;editor mohan;tiru;jagan;2019;cheque;letter;tdp;local language;ycp;mandapeta;sv mohan reddy;reddy;partyఆ టీడీపీ ఎమ్మెల్యేలని జగన్ ఫిక్స్ చేసేశారా?ఆ టీడీపీ ఎమ్మెల్యేలని జగన్ ఫిక్స్ చేసేశారా?jagan;editor mohan;tiru;jagan;2019;cheque;letter;tdp;local language;ycp;mandapeta;sv mohan reddy;reddy;partyWed, 24 Mar 2021 02:00:00 GMTజగన్ మోహన్ రెడ్డి హవా స్పష్టంగా నడుస్తోంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, అద్భుతమైన పాలనతో దూసుకెళుతున్న జగన్‌కు తిరుగులేని విజయాలు అందుతున్నాయి. అసలు జగన్ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకితతో ఉన్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో పస లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైపోయింది. ముందుగా పంచాయితీ ఎన్నికల్లో అదరగొట్టిన వైసీపీ, ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది.

ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం వైసీపీ జోరు కొనసాగింది. అందులోనూ టీడీపీకి తిరుగులేదు అనుకున్న మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ప్రజలు జగన్‌కు జై కొట్టారు. 2019 ఎన్నికల్లో మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతాలో పడ్డాయి. మండపేట నుంచి వరుసగా మూడోసారి వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధించగా, పెద్దాపురం నుంచి చినరాజప్ప వరుసగా రెండో సారి విజయం సాధించారు.

ఇలా వరుస విజయాలు సాధించిన టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెట్టేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మెజారిటీ పంచాయితీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలింది. పెద్దాపురం, మండపేట మున్సిపాలిటీలు వైసీపీనే గెలుచుకుంది.  ఈ రెండు మున్సిపాలిటీల్లో వైసీపీ భారీగానే వార్డులు గెలుచుకుంది.

అయితే టీడీపీకి కంచుకోటలుగా ఉన్న మండపేట, పెద్దాపురం మున్సిపాలిటిల్లో ఓడిపోవడం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు వైసీపీకి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. ఇలాగే మరో మూడేళ్లు వైసీపీ ఆధిక్యం కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ఓటమిని జగన్ ఫిక్స్ చేసినట్లే అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటినుంచైనా వైసీపీకి ధీటుగా వేగుళ్ళ జోగేశ్వరరావు, చినరాజప్ప పనిచేయాల్సిన అవసరముందని, ఎమ్మెల్యేలు ఇంకా కష్టపడాలని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు.  




ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>