PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcr2df08169-14b7-486b-83e1-e98c80024321-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcr2df08169-14b7-486b-83e1-e98c80024321-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి ఓ విచిత్రమైన సంస్కృతి పుట్టుకొచ్చింది. అదే పోలిక.. ప్రతి విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకరితో మరొకరు పోల్చి చూసుకుంటున్నారు. దీని ప్రభావం రాజకీయాలపై ప్రధానంగా పడుతోంది. అందులోనూ కేసీఆర్, చంద్రబాబు, జగన్ వంటి నాయకుల మధ్య పోటాపోటీ, రాజకీయ స్పర్థలు అనేక విషయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది రెండు రాష్ట్రాలు విడిపోయిన తొలినాళ్ల నుంచే మొదలైంది. ఉమ్మడి ఏపీ నుంచి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొదటి పీఆర్సీ విషయంలో ఈ jagan-kcr;kcr;amala akkineni;lakshmi;jagan;amaravati;andhra pradesh;cm;culture;ammavodiజగన్‌కు దిమ్మ తిరిగిపోయేలా కేసీఆర్ దెబ్బ.. ఎలా తట్టుకుంటాడో..?జగన్‌కు దిమ్మ తిరిగిపోయేలా కేసీఆర్ దెబ్బ.. ఎలా తట్టుకుంటాడో..?jagan-kcr;kcr;amala akkineni;lakshmi;jagan;amaravati;andhra pradesh;cm;culture;ammavodiWed, 24 Mar 2021 09:00:15 GMTసంస్కృతి పుట్టుకొచ్చింది. అదే పోలిక.. ప్రతి విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకరితో మరొకరు పోల్చి చూసుకుంటున్నారు. దీని ప్రభావం రాజకీయాలపై ప్రధానంగా పడుతోంది. అందులోనూ కేసీఆర్, చంద్రబాబు, జగన్ వంటి నాయకుల మధ్య పోటాపోటీ, రాజకీయ స్పర్థలు అనేక విషయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది రెండు రాష్ట్రాలు విడిపోయిన తొలినాళ్ల నుంచే మొదలైంది.


ఉమ్మడి ఏపీ నుంచి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొదటి పీఆర్సీ విషయంలో ఈ పోలిక వచ్చింది. అప్పట్లో కేసీఆర్ భారీగా పీఆర్సీ ప్రకటించడంతో  ఆ తర్వాత చంద్రబాబు కూడా భారీగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్ని ప్రభుత్వ పథకాల విషయంలో పోటీ కనిపిస్తోంది. మొదట్లో కేసీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కేసీఆర్ పైచేయి సాధించారనే చెప్పాలి. కల్యాణ లక్ష్మి, రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలు కేసీఆర్‌కు మంచి పేరు తెచ్చాయి.


అదే సమయంలో చంద్రబాబు అమరావతి తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా ప్రొజెక్టు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ జయభేరి మోగించగా.. చంద్రబాబు చతికిలపడ్డారు. అధికారం జగన్ కు అప్పగించారు. అయితే ఏపీ సీఎంగా జగన్ అయిన తర్వాత సీన్ మారింది. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా జగన్ కేసీఆర్ సర్కారును మించిన సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో ప్రకటించి అమలు చేస్తున్నారు. అమ్మఒడి, అగ్రవర్ణ మహిళలకు సైతం ఫించన్లు వంటి పథకాలు జగన్ కు పేరు తెచ్చి పెట్టాయి.


ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పీఆర్సీ సమరం ప్రారంభమైంది. కరోనా కష్ట కాలం తర్వాత కూడా కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించారు. ఇక ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. మరి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తట్టుకుని జగన్ సైతం అదే స్థాయిలో పీఆర్సీ ప్రకటిస్తారా లేదా అన్నది ఇప్పుడు సవాల్ గా మారింది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.  




మ‌నిష‌న్న‌త‌ర్వాత కొంచెమ‌న్నా ఉండాలి.. ఎన్నిసార్లు అడుగుతావేంటి?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>