PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan348e022b-521e-4cc2-a571-8ca65f4b90a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan348e022b-521e-4cc2-a571-8ca65f4b90a0-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైసీపీకి తిరుగులేదని పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో మరోసారి రుజువైన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన వైసీపీ, పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సూపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలనే చవిచూసింది. అలాగే ప్రజల్లో క్రేజ్ ఉన్న పవన్ పార్టీ జనసేన కూడా ఘోరంగానే ఓడిపోయింది. pawan kalyan;pawan;venkatesh;nani;tiru;janasena;2019;minister;cycle;cheque;tdp;ycp;janasena party;partyఆ నానికి పవన్‌తో ఇబ్బందేనా...? సైకిల్ రూట్ మారుతుందా?ఆ నానికి పవన్‌తో ఇబ్బందేనా...? సైకిల్ రూట్ మారుతుందా?pawan kalyan;pawan;venkatesh;nani;tiru;janasena;2019;minister;cycle;cheque;tdp;ycp;janasena party;partyWed, 24 Mar 2021 00:00:00 GMTవైసీపీ, పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సూపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలనే చవిచూసింది. అలాగే ప్రజల్లో క్రేజ్ ఉన్న పవన్ పార్టీ జనసేన కూడా ఘోరంగానే ఓడిపోయింది.

అయితే చాలాచోట్ల జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ డ్యామేజ్ జరిగిందనే చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేవారని అంటున్నారు. అసలు సాధారణ ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే అధికారంలోకి రాకపోయినా కనీసం 40 నుంచి 50 ఎమ్మెల్యేలు గెలుచుకునేవారు.

అలాగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే టీడీపీ-జనసేన కలిసి బరిలో ఉంటే ఎక్కువ నష్టం జరిగేది మంత్రి పేర్ని నానికే అని మచిలీపట్నం తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నాని, టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై దాదాపు 5 వేల మెజారిటీతో గెలిచారు. ఇక ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు దాదాపు 18 వేల ఓట్లు వచ్చాయి.

అప్పుడు టీడీపీ-జనసేన కలిసి పోటీలో దిగి ఉంటే నానికి గెలిచేవారే కాదని అంటున్నారు. అలాగే తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కలిసి పోటీ చేస్తే వైసీపీకి చుక్కలు కనిపించేవని మాట్లాడుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లోనైనా పవన్‌ని కలుపుకుని వెళితేనే తమకు లబ్ది చేకూరుతుందని టీడీపీ కేడర్ అంచనా వేస్తుంది. అప్పుడు నానికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. మొత్తానికైతే పవన్‌తో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని తమ్ముళ్ళు భావిస్తున్నారు.  




ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>