PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagance0bc3ac-c4a0-4bed-ad37-048363d8a5c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagance0bc3ac-c4a0-4bed-ad37-048363d8a5c2-415x250-IndiaHerald.jpgఏపీ సీఎంగా జగన్ జీతం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచించాలి. అందుకే ఎన్టీఆర్ వంటి నేతలు తాము జీతం కూడా తీసుకోకుండా పని చేస్తామని ప్రకటించారు. అయితే లెక్కల కోసం తీసుకోవాలి కాబట్టి ఒక్క రూపాయి జీతం తీసుకుంటామని ప్రకటించారు. దాన్ని అమలు చేసి చూపించారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మాత్రం జీతం తీసుకున్నారు. చట్టప్రకారం తనకు రావాల్సిన జీతం తీసుకోవడం ఎలాంటి తప్పు కూడా కాదు. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ మళ్లీ రూపాయి జీతం విధానం అవలంjagan;ntr;amala akkineni;praveen;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;cm;chief minister;ycp;nandamuri taraka rama rao;fatherజగన్ ను విమర్శల పాలు చేస్తున్న ఒక్క రూపాయి జీతం..?జగన్ ను విమర్శల పాలు చేస్తున్న ఒక్క రూపాయి జీతం..?jagan;ntr;amala akkineni;praveen;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;cm;chief minister;ycp;nandamuri taraka rama rao;fatherTue, 23 Mar 2021 08:00:00 GMTఏపీ సీఎంగా జగన్ జీతం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచించాలి. అందుకే ఎన్టీఆర్ వంటి నేతలు తాము జీతం కూడా తీసుకోకుండా పని చేస్తామని ప్రకటించారు. అయితే లెక్కల కోసం తీసుకోవాలి కాబట్టి ఒక్క రూపాయి జీతం తీసుకుంటామని ప్రకటించారు. దాన్ని అమలు చేసి చూపించారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మాత్రం జీతం తీసుకున్నారు. చట్టప్రకారం తనకు రావాల్సిన జీతం తీసుకోవడం ఎలాంటి తప్పు కూడా కాదు.

చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ మళ్లీ రూపాయి జీతం విధానం అవలంభించారు. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు తాను సీఎం అయ్యాక ఎప్పటిలాగానే జీతం తీసుకున్నారు. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తన తండ్రి పాలసీనే ఫాలో అవుతున్నాని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఆయన రెండు ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. అలా చూస్తే ఆయన జీతం ఇప్పటి వరకూ పాతిక రూపాయలకు మించకూడదు. కానీ.. ఇటీవల సీఎం జీతం విషయంలో లక్షల రూపాయల్లో పన్ను కట్టినట్టు  ప్రకటించడం కలకలం రేపుతోంది.

ఈ నెల 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 7,14,924 లక్షల రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లించినట్టు ప్రభుత్వం చెబుతోంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే పన్ను కట్టేది జీతానికి కాదని.. సీఎం హోదాలో  జగన్ చేయించుకున్న వైద్యానికి, బీమాలకూ  కట్టిన ఫీజులకు పన్ను అని వైసీపీ మద్దతు దారులు కొందరు వాదిస్తున్నారు.

అయితే ఈ వాదనలు అంతబలంగా  కనిపించడం లేదు. దీనిపై వైసీపీ నుంచి అధికార ప్రతినిధి వంటి వారు క్లారిటీ ఇస్తే కానీ వివాదం సమసిపోయేలా లేదు. వైసీపీ నుంచి సరైన స్పందన లేకపోతే.. అది జగన్ కు మచ్చగా మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఎలా స్పందిస్తుందో..? 


మాస్క్ జరిమానా@40 కోట్లు.. ఇది అసలు పరిస్థితి..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>