Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr54332952-6f09-49bd-85ca-6425f43f92ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr54332952-6f09-49bd-85ca-6425f43f92ba-415x250-IndiaHerald.jpgనాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వేటికవే వ్యూహాలు కూడా రచించుకుంటున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినా ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ను తట్టుకొని ఈ సీటులో మళ్లీ గెలవాలంటే మార్పు తప్పదనే అంచనాకు వచ్చింది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్ జరుగుతున్నటkcr;view;kcr;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mla;janareddy;reddy;partyపటాపట్ నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్...?పటాపట్ నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్...?kcr;view;kcr;nagarjuna akkineni;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mla;janareddy;reddy;partyTue, 23 Mar 2021 01:00:00 GMTఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వేటికవే వ్యూహాలు కూడా రచించుకుంటున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినా ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ను తట్టుకొని ఈ సీటులో మళ్లీ గెలవాలంటే మార్పు తప్పదనే అంచనాకు వచ్చింది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఆ పార్టీ చేయబోయే మార్పు ఏంటనేది గులాబీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో కాస్త ఫలితాలు అటుఇటుగా వచ్చినా.. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం తెలంగాణలోని అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీకి కాస్త ఊరటనిచ్చాయి.


 దీంతో అధినేత కేసీఆర్‌‌లో ఉత్సాహం రెట్టింపైంది. ఇక తమకు తిరుగులేదని మరోసారి చాటే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఎప్పటిలాగే ఫటాఫట్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు.మొన్నటివరకు వెనకా ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌‌.. ఇప్పుడు ఆ పంథాను మార్చారు. నాగార్జున సాగర్ బైపోల్‌లో మరణించిన నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కే టిక్కెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ పార్టీ వర్గాలకు సమాచారం పంపినట్లు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.


 నోముల భగత్‌కు పార్టీ నేతల సహకారం కూడా ప్రారంభమైంది. ఆయన ప్రచారానికి.. నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ నోముల భగత్‌ను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే గెలవడం లేదన్న సెంటిమెంట్ ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏర్పడింది. ఆ స్థానాల్లో ఉపఎన్నికల్లో కుటుంబసభ్యులెవరూ గెలవడం లేదు. అయితే అది అన్ని సార్లు వర్కవుట్ కాదని కేసీఆర్‌‌కు ఇప్పుడు బలమైన నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో సాగర్ టిక్కెట్ బీసీలకే ఇద్దామనుకున్నారు. రెడ్డి సామాజికవర్గానికి వారు పోటీపడినప్పటికీ.. బీసీల టిక్కెట్ బీసీలకే ఇద్దామని డిసైడయ్యారు.


ఓ వైపు కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలో ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని అనుకున్నారు.సాగర్ నియోజకవర్గంలో అత్యధికం యాదవ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర పార్టీ నేతలు ఎవరూ బలవంతులు కాదు. వారు పార్టీకి భారంగా మారతారు కానీ.. పార్టీకి వారి బలం ప్లస్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు వరకూ కేసీఆర్‌కు ధైర్యం లేకపోయింది. ఇప్పుడు మాత్రం.. ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో నోముల కుమారుడికి టిక్కెట్ ఖరారయింది. దీనిపై టీఆర్ఎస్‌లో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి కూడా లేదు.


శృంగార శక్తి పెరగాలంటే, ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి...?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>