PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp7ba0071f-1da5-456e-8559-91e50c59b271-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp7ba0071f-1da5-456e-8559-91e50c59b271-415x250-IndiaHerald.jpgబెజవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రాజకీయం బాగా రంజుగా ఉంటుంది. ఇక్కడ సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతల మధ్య జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, బోండా ఉమా-బుద్దా వెంకన్నలకు అసలు పొసగలేదు. ఒకరిపై ఒకరు డైరక్ట్‌గా విమర్శలు చేసుకున్నారు. అధినేత చంద్రబాబు వార్నింగ్‌లు ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఏదో ఆయన విజయవాడ వచ్చినప్పుడు కలిసిపోయినట్లు నడిచారు. కానీ తర్వాత మళ్ళీ మాములుగానే రచ్చ నడిచిందtdp;nani;bonda;krishna river;jagan;vijayawada;devineni avinash;2019;mp;district;telugu;kesineni nani;krishna district;tdp;buddha venkanna;party;racchaబెజవాడ రాజకీయాలు దేవినేనికి కలిసొచ్చినట్లేనా....!బెజవాడ రాజకీయాలు దేవినేనికి కలిసొచ్చినట్లేనా....!tdp;nani;bonda;krishna river;jagan;vijayawada;devineni avinash;2019;mp;district;telugu;kesineni nani;krishna district;tdp;buddha venkanna;party;racchaTue, 23 Mar 2021 00:00:00 GMTపార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతల మధ్య జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, బోండా ఉమా-బుద్దా వెంకన్నలకు అసలు పొసగలేదు. ఒకరిపై ఒకరు డైరక్ట్‌గా విమర్శలు చేసుకున్నారు. అధినేత చంద్రబాబు వార్నింగ్‌లు ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఏదో ఆయన విజయవాడ వచ్చినప్పుడు కలిసిపోయినట్లు నడిచారు. కానీ తర్వాత మళ్ళీ మాములుగానే రచ్చ నడిచింది.

ఇలా నాయకుల మధ్య విబేధాలు వైసీపీకి ఏ విధంగా కలిసొచ్చిందో తెలిసిందే. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం 20 డివిజన్లు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈ ఓటమి దెబ్బకు విజయవాడలో కేశినేని హవా తగ్గినట్లైంది. ఇదే సమయంలో దేవినేని ఉమాకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు.

మామూలుగా కృష్ణా జిల్లా రాజకీయాలపై ఉమా ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉమా పెత్తనం నడుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఉమా తొలిసారి ఓడిపోయారు. ఈ ఓటమితో ఉమా పెత్తనం తగ్గింది. ముఖ్యంగా విజయవాడ నగరంపై ఉమా పట్టు కోల్పోయారు. ఇక్కడ ఎంపీగా ఉన్న కేశినేని హవా ఎక్కువైంది. దీంతో ఉమాకు విజయవాడలో ఎంట్రీ తగ్గింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఉమాకు ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కార్పొరేషన్‌లో గెలుపు భారాన్ని కేశినేని తన భుజాలపై వేసుకున్నారు. ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేసేలా చేస్తానని శపథం కూడా చేశారు. పైగా సొంత నేతలపైనే విమర్శలు గుప్పించారు.

ఇక చివరికి ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జెండా ఎగరలేదు. ఈ దెబ్బకు కేశినేని కూడా కనబడటం తగ్గించేశారు. ఇలా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కేశినేనికి మైనస్ అయితే దేవినేనికి ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే కృష్ణా జిల్లాలో మళ్ళీ ఉమా ఆధిపత్యం పెరిగేలా ఉందనే చెప్పొచ్చు.




ఈటల కామెంట్స్.. తిరుగుబాటు కాదు.. వార్నింగ్ బెల్స్.. ?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>