PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news3f140fde-784b-4ae2-9ba1-ff1a50982dc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-latest-news3f140fde-784b-4ae2-9ba1-ff1a50982dc8-415x250-IndiaHerald.jpg దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. యూపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్కూళ్లు మూసివేశారు.మార్చి 31 వరకు ప్రాథమిక తరగతి నుంచి 8వ తరగతి వరకు నడిచే స్కూళ్లన్నీ మూసివేశారు. corona;telangana;uttar pradesh;chief minister;central government;marchయూపీలో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న క‌రోనా... ఎన్ని కేసులో తెలుసా..?యూపీలో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న క‌రోనా... ఎన్ని కేసులో తెలుసా..?corona;telangana;uttar pradesh;chief minister;central government;marchTue, 23 Mar 2021 15:50:48 GMT
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. యూపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్కూళ్లు మూసివేశారు.మార్చి 31 వరకు ప్రాథమిక తరగతి నుంచి 8వ తరగతి వరకు నడిచే స్కూళ్లన్నీ మూసివేశారు. మార్చి 24 నుంచి మార్చి 31వరకు యూపీలో అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్ని ఇతర విద్యా సంస్థల్లో పరీక్షలు జరగని స్కూళ్లన్నీ మార్చి 25 నుంచి మార్చి 31 వరకు మూసివేయనున్నట్టు పేర్కొంది. కరోనాతో పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి సహా అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.


 రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ప్రస్తుతం యూపీలో 3,036 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, 8,759 మంది కరోనాతో మరణించారు. అలాగే 5,95,743మంది కరోనా నుంచి కోలుకున్నారు.తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులే టార్గెట్‌గా స్కూళ్లలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు స్కూళ్లలోనే వెలుగుచూశాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు పాఠశాలల్లో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేపట్టింది.


మరోవైపు ఈనెల 26న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే సమావేశాలను త్వరగా ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉధృతి లేకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా కట్టడి చర్యలను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అటు స్కూళ్లలో కరోనా వ్యాప్తిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.ఇదిలా ఉండ‌గా వ్యాక్సిన్ పంపిణీని దేశ వ్యాప్తంగా వేగిరం చేస్తున్నారు.


శ్రీవారి హుండీలో డబ్బు చోరీ.. ఇంతలో దిమ్మతిరిగే ట్విస్ట్..?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>