PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-lock-down-breaking-news3adccfb5-7552-441f-be8c-fb4eab11bdf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-lock-down-breaking-news3adccfb5-7552-441f-be8c-fb4eab11bdf8-415x250-IndiaHerald.jpgప‌రిచ‌యం లేని పేరు అది. జీవితాంతం గుర్తుంచుకునేలా చేసింది. మాన‌వ జీవితాల‌పై పెను ప్ర‌భావం చూపించింది. ఉరుకులు, ప‌రుగుల జీవితం ఒక్క‌సారిగా స్తంభించిపోయేలా చేసింది. ఎక్క‌డివారిని అక్క‌డే నిల‌బెట్టేసింది. ప్ర‌కృతిని మాత్రం క‌రుణించింది. దానిపేరే.. లాక్‌డౌన్‌. ఊహకు అందని రీతిలో కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా జ‌న‌జీవ‌నం ఆగిపోయింది. ప్రకృతి మాత్రం ఊపిరిపోసుకుంది. ఉగాదికి కొత్త‌గా చిగుళ్లు ఎలా వ‌స్తాయో న‌దులు, జీవ‌రాశులు కాలుష్యంలేని జీవితాన్ని అనుభ‌వించాయి. latest news, lock down, breaking news;modi;jeevitha rajaseskhar;prakruti;india;narendra modi;prime minister;2020;central government;pollution;march;coronavirus;narendraలాక్‌డౌన్ 2.Oలాక్‌డౌన్ 2.Olatest news, lock down, breaking news;modi;jeevitha rajaseskhar;prakruti;india;narendra modi;prime minister;2020;central government;pollution;march;coronavirus;narendraMon, 22 Mar 2021 06:49:38 GMTకేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా జ‌న‌జీవ‌నం ఆగిపోయింది.  ప్రకృతి మాత్రం ఊపిరిపోసుకుంది. ఉగాదికి కొత్త‌గా చిగుళ్లు ఎలా వ‌స్తాయో న‌దులు, జీవ‌రాశులు కాలుష్యంలేని జీవితాన్ని అనుభ‌వించాయి. య‌మునా న‌ది త‌నంత‌ట తానే 33 శాతం శుభ్ర‌ప‌రుచుకుంది. చాల‌మంది జీవితాల‌ను అత‌లాకుత‌లం చేసిన లాక్‌డౌన్ ఏడాది పూర్తిచేసుకుంది.

అస్త‌వ్య‌స్త‌మైన జ‌న‌జీవితం
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు. 2020 మార్చి 22  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. త‌ర్వాత మార్చి 24 న ప్రధానమంత్రి రెండోసారి ప్రసంగిస్తూ 21 రోజులపాటు (2020 మార్చి 25 నుంచి  ఏప్రిల్ 14 వ‌ర‌కు) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఇది మొద‌లు జ‌న‌జీవితం ఎంత అస్త‌వ్య‌స్థ‌మైందో మ‌నంద‌రికీ తెలిసిందే. మెడిక‌ల్‌, నిత్యావ‌స‌రాలు, ఆహారం లాంటి త‌దిత‌ర నాలుగైదు వ్యాపారాలు మిన‌హా అన్నీ దెబ్బ‌తిన్నాయి.ఉద్యోగుల వేత‌నాల్లో కోత ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇప్ప‌టికీ కోలుకోవ‌డానికి ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ప‌డుతూనే ఉన్నారు.

న‌డిచి న‌డిచి ప్రాణాలు కోల్పోయారు
వైర‌స్ వ్యాప్తిని నిరోధించే విష‌యంలో కొన్ని దేశాల నిర్లక్ష్యం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో వ్యవస్థలు స్తంభించి పోయాయి. వ‌ల‌స కూలీల ఇక్క‌ట్లు చెప్ప‌న‌ల‌వి కాదు. న‌డిచి న‌డిచి ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న‌లు హృద‌యాల‌ను క‌లిచివేసింది. సోనూసూద్‌లాంటివారు చేసిన సాయం ఇత‌రుల‌కు స్ఫూర్తిని నింపింది. ఇంటిద‌గ్గ‌రే ఉండ‌టంతో కుటుంబ స‌భ్య‌లుతో అనుబంధాలు దృఢ‌మ‌య్యాయి. మ‌రికొన్ని కుటుంబాల్లో విభేదాలు త‌లెత్తాయి. కొన్ని కంపెనీలు మూత‌ప‌డ్డాయి. మ‌రికొన్ని కంపెనీలు ఉత్ప‌త్తిని త‌గ్గించాయి. ఉద్యోగాల్లో పెట్టిన కోత ప్ర‌భావం ఇప్ప‌టికీ చూపిస్తూనే ఉంది. మ‌ళ్లీ రెండోద‌శ‌లో క‌రోనా విజృంభిస్తుండ‌టంతో మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉంటుందేమోన‌ని అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు.


అంబానీ కేసులో అన్నీ ట్విస్టులే!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>