PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallannafef97a5e-530d-4479-8c81-1a140fa4255e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallannafef97a5e-530d-4479-8c81-1a140fa4255e-415x250-IndiaHerald.jpgదొంగ ఓట్లు.. నోట్ల కట్టలతోనే అధికార పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనట్లుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటర్లకు డబ్బులు పంచిందని,వంద కోట్ల రూపాయల వరకు అధికార పార్టీ ఖర్చు పెట్టిందని చెబుతున్నారు విపక్ష నేతలు.teenmar mallanna;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;chief minister;minister;thief;donga;partyబోగస్ ఓట్లతోనే టీఆర్ఎస్ గెలుపు!బోగస్ ఓట్లతోనే టీఆర్ఎస్ గెలుపు!teenmar mallanna;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;chief minister;minister;thief;donga;partySun, 21 Mar 2021 16:17:18 GMTపార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వదనే చర్చ మొదట జరిగింది. ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదనే ప్రచారం జరిగింది.హైదరాబాద్ స్థానంలో అభ్యర్థులు లేకపోవడంతో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదని అన్నారు. అయితే  మండలి ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకుంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. దొంగ ఓట్లు.. నోట్ల కట్టలతోనే అధికార పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనట్లుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటర్లకు డబ్బులు పంచిందని,వంద కోట్ల రూపాయల వరకు అధికార పార్టీ ఖర్చు పెట్టిందని చెబుతున్నారు విపక్ష నేతలు.

దొంగ ఓట్ల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని స్పష్టమైందని తీన్మార్ మల్లన్న చెప్పారు. ‘వంద కోట్లు.. దొంగనోట్లు’ ఈ ప్రయత్నం ద్వారా ప్రజల గొంతుకను చట్టసభకు రాకుండా  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడ్డుకున్నారని ఆరోపించారు. బరాబర్ వస్తా.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే రోజు తీసుకువస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు తీన్మార్ మల్లన్న. తానే అనేక అక్రమాలను బయటపెట్టానన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సరైన గుణపాఠాన్ని ప్రభుత్వానికి తెలిపారన్నారు.

పీఆర్సీ ఇవ్వబోమని ఉద్యోగులను టీఆర్ఎస్ భయపెట్టిందని  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పీఆర్సీ ఇవ్వరని భయపడే ఉద్యోగులు టి‌ఆర్‌ఎస్ కు ఓటేశారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఉద్యమం వల్లే పీఆర్సీ పై కే‌సి‌ఆర్ స్పందించారన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే కచ్చితంగా సహకరిస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని బండి సంజయ్ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. దొంగ ఓట్లు.. నోట్లు పంచడం వల్లే ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. పట్టభద్రులు కాని వారికి ఓట్లు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదన్నారు.




హెరాల్డ్ స్మ‌రామీ :స‌క‌ల క‌ళ‌ల పురుషుడు గోథే

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>