PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila5ef7b45e-4147-4f23-bf52-c5088942ad85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila5ef7b45e-4147-4f23-bf52-c5088942ad85-415x250-IndiaHerald.jpgవైఎస్ ష‌ర్మిల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోయి.. రాజన్న పాలన రావాలంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ, తెలంగాణ రెండూ రెండు కళ్లని షర్మిల అన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని ఆమె అన్నారు. పోడు భూములు పంచిన ఘనత వైఎస్సార్‌దని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలో రాజన్య రాజ్యం తీసుకొచ్చేందుకే తాను ముందుకొచ్చానని.. షర్మిలమ్మ రాజ్యం కోసం కాదన్నారుsharmila;view;kcr;kumaar;ajay;dr rajasekhar;vedhika;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;district;chief minister;minister;khammam;v;party;mantraకేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న ష‌ర్మిల‌...అదే వ్యూహంతోన‌ట‌...కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న ష‌ర్మిల‌...అదే వ్యూహంతోన‌ట‌...sharmila;view;kcr;kumaar;ajay;dr rajasekhar;vedhika;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;district;chief minister;minister;khammam;v;party;mantraSat, 20 Mar 2021 09:00:00 GMTతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోయి.. రాజన్న పాలన రావాలంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ, తెలంగాణ రెండూ రెండు కళ్లని షర్మిల అన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని ఆమె అన్నారు. పోడు భూములు పంచిన ఘనత వైఎస్సార్‌దని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలో రాజన్య రాజ్యం తీసుకొచ్చేందుకే తాను ముందుకొచ్చానని.. షర్మిలమ్మ రాజ్యం కోసం కాదన్నారు.  రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ లేదని.. అందుకోసమే పార్టీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.


 ఆమె పార్టీ ఏర్పాటు ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అధికార టీఆర్ఎస్ గుండెల్లో గుబులు రేపుతోంది. పైకి మాత్రం అదేం లేదు అని అంటున్నారు. లోన మాత్రం భయపడుతున్న‌ట్లు నేత‌ల వ్యాఖ్య‌లు వింటేనే అర్థ‌మ‌వుతోందంటూ ప‌లువురు మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా షర్మిల పార్టీపై, త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నారని, ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూశారని, ఆ తర్వాత కేసీఆర్ వైపు మళ్ళారని పువ్వాడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా రాజన్న రాజ్యం తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్నారు.



ఇక్కడి ప్రజలు ఎవరి ట్రాప్ లోనూ పడరని, ఒకవేళ చిన్నాచితకా నాయకులు పడితే వాళ్ల ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ష‌ర్మిల తెలంగాణ రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు జోరు పెంచారు. చరిత్రలో కనీవినీ రీతిలో ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి తీరుతామ‌ని  వైఎస్ షర్మిల స్ప‌ష్టం చేస్తున్నారు.  హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో శుక్రవారం ఆమె ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ, ఏపీ రెండు ప్రాంతాలూ రెండు కళ్ళలా ఉండేవని ఆమె చెప్పారు. భారీ బ‌హిరంగ స‌భా వేదిక పై నుంచే పార్టీ విధి విధానాలపై కూడా అక్కడే ప్రకటన చేస్తానని చెప్పారు.


టాలీవుడ్ కి మరో మల్లూ బ్యూటీ.. ధరమ్ తేజ్ సినిమాలో ఫిక్స్..!

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?

పవన్, మహేష్ లను ఆ డైరెక్టర్ కలుపుతాడట..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>