Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/upstocks-is-the-offcial-partner-for-ipl-2021-season94e8a219-da45-4257-ba6c-e6cee6cb2909-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/upstocks-is-the-offcial-partner-for-ipl-2021-season94e8a219-da45-4257-ba6c-e6cee6cb2909-415x250-IndiaHerald.jpg ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 అఫీషియల్ పార్ట్‌నర్‌షిప్ నుంచి కీలక సంస్థ తప్పుకుంది. గతేడాది టోర్నీ కోసం సౌత్‌ఇండియా ఎడ్యుకేషన్ సంస్థ అన్‌ఎకాడెమీతో భారత క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల పాటు అన్‌ఎకాడెమీ సంస్థ ఐపీఎల్‌కు అధికారిక భాగస్వామిగా ఉంటుందని అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది. అయితే ఏమయిందో ఏమో కానీ....ipl 2022;education;jeevitha rajaseskhar;ravi anchor;mumbai;cricket;bcci;chennai;champion;contract;royal challengers;anandamమూడేళ్లనుకుంటే ఒక్క ఏడాదితోనే ఐపీఎల్‌కు గుడ్‌బై.. కొత్త పార్ట్‌నర్ ఎవరంటే..మూడేళ్లనుకుంటే ఒక్క ఏడాదితోనే ఐపీఎల్‌కు గుడ్‌బై.. కొత్త పార్ట్‌నర్ ఎవరంటే..ipl 2022;education;jeevitha rajaseskhar;ravi anchor;mumbai;cricket;bcci;chennai;champion;contract;royal challengers;anandamTue, 16 Mar 2021 22:16:13 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 అఫీషియల్ పార్ట్‌నర్‌షిప్ నుంచి కీలక సంస్థ తప్పుకుంది. గతేడాది టోర్నీ కోసం సౌత్‌ఇండియా ఎడ్యుకేషన్ సంస్థ అన్‌ఎకాడెమీతో భారత క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల పాటు అన్‌ఎకాడెమీ సంస్థ ఐపీఎల్‌కు అధికారిక భాగస్వామిగా ఉంటుందని అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది. అయితే ఏమయిందో ఏమో కానీ.. ఈ ఏడాది టోర్నీ కోసం అన్‌ఎకాడెమీకి బదులుగా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఈ ఏడాది నుంచి ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఒప్పందం ఒకే ఏడాదికి మాత్రమే పరిమితం కాదని, ఇక ముందు కూడా కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.

దీనిపై బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు.. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా అప్‌స్టాక్స్‌ను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాలక మండలి ఎంపిక చేసినట్లు తెలిపారు. ‘భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న ఈ డిజిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ ఐపీఎల్‌ భాగస్వామిగా ఉంటుంది. ఇది కేవలం ఒక్క ఏడాదికే పరిమితం అయ్యే ఒప్పందం కాదు’’ అంటూ పేర్కొన్నారు. దీనిపై ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. లీగ్‌ అఫీషియల్‌ పార్టనర్‌గా అప్‌స్టాక్స్‌‌ను తీసుకోవడం హర్షనీయమని అన్నాడు.

అప్‌స్టాక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రవి కుమార్‌ కూడా బీసీసీఐతో ఒప్పందంపై స్పందించారు. ఈ ఒప్పందం తమకు నూతన ఉత్సాహాన్నిచ్చిందన్నారు. భారత్‌లో క్రికెట్‌ ఓ క్రీడ కాదని, భారతీయుల జీవితంలో అదో భాగమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో జన్మించిన వారిపై ఐపీఎల్‌ ప్రభావం ఎక్కువగా ఉందని, అలాంటి లీగ్‌కు భాగస్వామిగా వ్యవహరించడం తమకు ఆనందంగా ఉందని అన్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సీజన్.. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్‌-2021 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది.


తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>