PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tadipatrif8289b49-cb74-4fa8-b2ad-d0dcdbe19be4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tadipatrif8289b49-cb74-4fa8-b2ad-d0dcdbe19be4-415x250-IndiaHerald.jpgఅమరావతి రాజదాని దళిత జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయుడి పై పెట్టిన సిఐడి కేసు రాజకీయ దురుద్దేశాలతో పెట్టిందే అని ఆయన ఆరోపించారు. కృష్ణాయపాలెంలోనే ఎస్టీ రైతులపైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఈ ప్రభుత్వం అభాసుపాలైంది అని ఆయన మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అని ఆయన ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తా? అని నిలదీశారు. ఎఫ్‌tdp,ycp,ap;cbn;alla rama krishna reddy;jagan;amaravati;geum;scheduled caste;scheduled tribes;capital;chief minister;mla;tdp;ycp;jac;reddy;krishnayapalem;sajjala ramakrishna reddyవైఎస్ వల్ల సాధ్యం కానిది జగన్ చేయగలరా...?వైఎస్ వల్ల సాధ్యం కానిది జగన్ చేయగలరా...?tdp,ycp,ap;cbn;alla rama krishna reddy;jagan;amaravati;geum;scheduled caste;scheduled tribes;capital;chief minister;mla;tdp;ycp;jac;reddy;krishnayapalem;sajjala ramakrishna reddyTue, 16 Mar 2021 19:00:00 GMTఅమరావతి రాజదాని దళిత జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయుడి పై పెట్టిన సిఐడి కేసు రాజకీయ దురుద్దేశాలతో పెట్టిందే అని ఆయన ఆరోపించారు. కృష్ణాయపాలెంలోనే ఎస్టీ రైతులపైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఈ ప్రభుత్వం అభాసుపాలైంది అని ఆయన మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అని ఆయన ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తా? అని నిలదీశారు.

ఎఫ్‌ఐఆర్‌లో భూములు అమ్మిన వ్యక్తుల పేర్లుగాని, కొన్న వ్యక్తుల పేర్లు గాని లేకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి అని అన్నారు. గతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది అని గుర్తు చేసారు. దీంతో రాజధాని పై మరో కుట్ర చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అని ఆయన మండిపడ్డారు. అసలు ఎస్సీ, ఎస్టీ కాని వ్యక్తి  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  ఒక మాజీ ముఖ్యమంత్రి పై అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారు అని నిలదీశారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఏపీలో నియంత పాలన అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోంది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులో భాగమే అని అన్నారు. జరుగుతున్న చర్యలన్నీ వైసీపీ మైండ్ గేమ్ లో భాగమే అని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా జగన్ తీరు మారడం లేదు అని, ఇన్ సైడ్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు స్వచ్ఛమైన రాజకీయాలు చేశారు, వైఎస్ 26 కమిటీలు వేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు అని అన్నారు.


బడబాగ్ని బద్ధలవుతోందా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>