PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgప‌సుపు బోర్డుపై కేంద్ర ప్ర‌భుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చేసింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసింది. ఇక పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానaravindh;allu aravind;amala akkineni;suresh;hyderabad;bharatiya janata party;warangal;mp;minister;turmeric;central government;khammam;reddy;partyప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!aravindh;allu aravind;amala akkineni;suresh;hyderabad;bharatiya janata party;warangal;mp;minister;turmeric;central government;khammam;reddy;partyTue, 16 Mar 2021 10:29:23 GMTకేంద్ర ప్ర‌భుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చేసింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసింది. ఇక  పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో బోర్డు కార్యాలయాలు ఉన్నందున  కొత్త‌గా పసుపు బోర్డు ఏర్పాటు ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిన‌ట్ల‌యింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే..? నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంద‌ని స‌రిగ్గా ప‌దిహేను రోజుల క్రితం ఎంపీ అర‌వింద్ ఢిల్లీలో పార్ల‌మెంట‌రీ ప్రాంగ‌ణంలో మీడియాకు వివ‌రించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు కేంద్రమంత్రికి సూచన చేశారనీ.. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిందని అర‌వింద్ తెలిపారు. అయితే ఆయ‌న చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా పార్ల‌మెంట‌రీ సాక్షిగా కేంద్ర మంత్రి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ప‌రిణామంతో నిజామాబాద్ రైతాంగంలో ఎలాంటి అసంతృప్తి జ్వాల‌లు ఎగిసిపడుతాయోన‌ని బీజేపీ శ్రేణుల్లో కాస్త టెన్ష‌న్ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎలాంటి నిర‌స‌న వ్య‌క్తమ‌వుతుందో వేచి చూడాలి.





పుర పోరు: చీరాల మున్సిపాల్టీ గెలిచినా క‌ర‌ణంలో కంగారు.. రీజ‌నేంటి ?

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?

యాంకర్ సుమ కెరీర్‌లో ఎన్ని ఎదురు దెబ్బలు ఉన్నాయో తెలుసా..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>