Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pant0b881132-9c03-4e81-8b5b-5fad61dc03e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pant0b881132-9c03-4e81-8b5b-5fad61dc03e7-415x250-IndiaHerald.jpgటీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఓ స్టార్‌లా మారిపోయాడు. అతడి దూకుడైన ఆటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒకపక్క తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయినా..rishabh pant;rani;varsha;india;twitter;rishabh pant;icc t20;shreyas iyer;fidaa;paruguఅప్పుడు ఆండర్సన్.. ఇప్పుడు ఆర్చర్.. పంత్ బాదుడుకు ఇంకెంతమంది..అప్పుడు ఆండర్సన్.. ఇప్పుడు ఆర్చర్.. పంత్ బాదుడుకు ఇంకెంతమంది..rishabh pant;rani;varsha;india;twitter;rishabh pant;icc t20;shreyas iyer;fidaa;paruguSat, 13 Mar 2021 10:27:19 GMTఇంటర్నెట్ డెస్క్:  టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఓ స్టార్‌లా మారిపోయాడు. అతడి దూకుడైన ఆటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒకపక్క తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయినా పంత్ కొట్టిన ఓ షాట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విసిరిన ఓ మెరుపు బంతిని అంతే మెరుపు వేగంతో రివర్స్ స్కూప్‌ షాట్‌తో థర్డ్ మ్యాన్ దిశగా సిక్స్ బాదేశాడు. ఇప్పుడు ఈ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా పంత్ ఇదే తరహా రివర్స్ స్కూప్‌తో థర్డ్ మ్యాచ్ దిశగానే సిక్స్ బాదాడు. అయితే అప్పుడు పంత్ బాదుడుకు బలైంది ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్. అహ్మదాబాద్‌లోనే జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ వేసిన ఓ బంతిని పంత్ ఇదే తరహాలో సిక్స్ కొట్టాడు. ఇక ఇప్పుడు తొలి టీ20లో ఆర్చర్ వేసిన 90 మైళ్ల వేగంతో వేసిన ఆర్చర్ విసిరిన బంతిని సునాయాసంగా సిక్స్ బౌండరీ దాటించేశాడు. అంతేకాకుండా ఆ తరువాతి బంతిని కూడా స్కేర్ లెగ్‌లో ఫోర్ బాదేశాడు. అయితే కొద్ది సేపటికే పంత్ అవుట్ కావడం, మిగతా బ్యాట్స్‌మెన్ కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి టీ20లో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. కాగా.. శ్రేయాస్ అయ్యర్(67) ఒక్కడే అర్థ సెంచరీతో రాణించాడు.

అయ్యర్ అర్థ సెంచరీతో ఎలాగోలా 124 పరుగులు చేసిన టీమిండయా ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 15.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఛేజ్ చేసింది. ఓపెనర్లు, జోస్ బట్లర్(28) జేసన్ రాయ్(49) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా రాయ్ భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తరువాత అతడు అవుట్ అయినా.. బెయిర్‌స్టో, డెవిడ్ మలాన్‌లు కలిసి లాంఛనం పూర్తి చేశారు. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.

" style="height: 369px;">




ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>