PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆయనకు అసలు విషయాన్ని చెప్పారని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జగన్ కు ముందే సమాచారం ఉంది అని కొన్ని పత్రికలలో కూడా వార్తలు వస్తున్నాయys jagan;modi;delhi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;narendra modi;industries;telugu;vishakapatnam;prime minister;chief minister;central government;ycp;party;narendraజగన్ భారీ బహిరంగ సభ... టీడీపీకి ఆహ్వానంజగన్ భారీ బహిరంగ సభ... టీడీపీకి ఆహ్వానంys jagan;modi;delhi;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;narendra modi;industries;telugu;vishakapatnam;prime minister;chief minister;central government;ycp;party;narendraWed, 24 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆయనకు అసలు విషయాన్ని చెప్పారని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జగన్ కు ముందే సమాచారం ఉంది అని కొన్ని పత్రికలలో కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి ఈ విషయంలో వెనక్కు తగ్గాలని ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక అడుగు కూడా వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

విశాఖ ఉక్కు పరిశ్రమ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలను కూడా జగన్ ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు దృష్టి పెట్టలేదు అంటే మాత్రం భవిష్యత్తులో వైసీపీ చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ బహిరంగ సభ ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో తాను కూడా పోరాటం చేస్తున్నాను అని చెప్పడానికి జగన్ ప్రయత్నం చేయనున్నారు.


దిశర‌వి కేసులో కోర్టు తీర్పు వారికే గ‌ట్టిగా త‌గిలిందిగా... ఇప్ప‌డేం చేస్తారు...!

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?

పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?

పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>