PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections306c6156-da24-4ddd-a153-129531d287f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections306c6156-da24-4ddd-a153-129531d287f8-415x250-IndiaHerald.jpgగ్రామ పంచాయతీ ఎన్నికల పోరు నిన్నటితో ముగిసింది.. వైసీపీ నేతలకు సంతోషాన్ని కలిగించింది. నాలుగో విడత ఎన్నికలలో ఎలాగైనా విజయాన్ని కైవసం చేసుకోవాలని భావించిన టీడీపీ కి గట్టి షాక్ తగిలింది.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు.jagan-nimmagadda-elections;cbn;amala akkineni;ravi anchor;jagan;kuppam;panchayati;chief minister;tdp;pulivendula;ycp;partyజగడ్డ: పులివెందులలో విజయభేరీ మోగించిన వైసీపీ..జగడ్డ: పులివెందులలో విజయభేరీ మోగించిన వైసీపీ..jagan-nimmagadda-elections;cbn;amala akkineni;ravi anchor;jagan;kuppam;panchayati;chief minister;tdp;pulivendula;ycp;partyMon, 22 Feb 2021 08:06:24 GMTపంచాయతీ ఎన్నికల పోరు నిన్నటితో ముగిసింది.. వైసీపీ నేతలకు సంతోషాన్ని కలిగించింది. నాలుగో విడత ఎన్నికలలో ఎలాగైనా విజయాన్ని కైవసం చేసుకోవాలని భావించిన టీడీపీ కి గట్టి షాక్ తగిలింది.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు.



 ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సొంత పంచాయతీ కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఓటమిని చవి చూశారు..నియోజకవర్గం లో ఎక్కడా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికల్లో వైసీపీకి దీటైన పోటీని ఇవ్వలేక పోయారని వెలువడిన ఫలితాలు స్పష్టం చేశాయి. కాగా, పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.



5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే జయభేరి మోగించడం గమనార్హం. ఏకంగా 31 వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. కుప్పంలో అభివృద్ధి చేశానంటూ బూటకపు మాటలు చెప్పే చంద్రబాబుకు ఆ నియోజకవర్గ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే ఈ విజయానికి కారణం జగన్ అమలు చేసిన పథకాలే కారణం అని వైసీపీ అభిమానులు అంటున్నారు. మొత్తానికి ఈ విజయం తో వైసీపీ స్థాయి మరింతగా పెరిగిందని చెప్పాలి.
మిగిలిన పార్టీలకు పులివెందుల నియోజక వర్గంలో ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం.. ఏది ఏమైనా కూడా ఈ విజయాన్ని
పులివెందుల వాసులు సంబరంగా జరుపుకుంటున్నారు


శరీరంలో ఏర్పడిన విషపదార్ధాలను తొలగించేందుకు సులువైన మార్గాలు ఇవే..!

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!

జగడ్డ : టీడీపీ మాజీ మంత్రికి గట్టి షాక్...?

హెరాల్డ్ సెటైర్ : పాపం..ఎల్లోమీడియా బాధ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>