PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-bumper-offer-for-urban-area-people5c6d853c-4b87-44a0-8109-619a6c9bfcc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-bumper-offer-for-urban-area-people5c6d853c-4b87-44a0-8109-619a6c9bfcc1-415x250-IndiaHerald.jpgపురపాలక సంస్థల ఎన్నికలు తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ ప్రకటన వచ్చిన రోజే సీఎం జగన్ పట్టణ ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పారు. అయితే సీఎం జగన్ సమీక్ష ముందుగానే నిర్ణయించుకున్నది కావడంతో ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. నగరాలు, పట్టణాల్లోని పేదలు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమంపై జగన్ మరిన్ని సూచనలు చేశారు. లాభాపేక్షలేకుండా నిర్ణీత ధరలకే ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జcm jagan;jagan;populationపురపోరుకి జగన్ తాయిలాలు ప్రకటించినట్టేనా..?పురపోరుకి జగన్ తాయిలాలు ప్రకటించినట్టేనా..?cm jagan;jagan;populationTue, 16 Feb 2021 11:00:00 GMTజగన్ పట్టణ ప్రాంత ప్రజలకు శుభవార్త  చెప్పారు. అయితే సీఎం జగన్ సమీక్ష ముందుగానే నిర్ణయించుకున్నది కావడంతో ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. నగరాలు, పట్టణాల్లోని పేదలు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమంపై జగన్ మరిన్ని సూచనలు చేశారు. లాభాపేక్షలేకుండా నిర్ణీత ధరలకే ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జగన్.

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్, అర్బన్‌ హౌసింగ్‌ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు జగన్. స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను అధికారులు సీఎం జగన్ ముందు ఉంచారు. దీనిలో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు జగన్. ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే.. స్మార్ట్ టౌన్ షిప్ ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. వివాదాలు, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో కూడిన క్లియర్‌ టైటిల్ ‌తో లాభాపేక్ష లేకుండా ప్లాట్లను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ఈ స్కీం కోసం భూములను ఏవిధంగా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? అనే విషయాలపై చర్చించారు.

మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గృహనిర్మాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ల్యాండ్‌ బ్యాంకు మెయింటెన్ చేయాలన్నారు. నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు స్మార్ట్‌ టౌన్స్‌ రూపకల్పనకు ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్‌ సిద్ధంచేసేలా ప్రణాళిక వేసినట్లు వివరించారు.


జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>