PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttarakhand50c2edd5-0015-4a90-b468-21bea293df35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttarakhand50c2edd5-0015-4a90-b468-21bea293df35-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్‌ జలవిలయానికి కేంద్రమైన నందాదేవి పర్వతం కొండ చరియలు విరిగిపడటం వల్ల దాని అంచున భారీ గొయ్యి ఏర్పడిన‌ట్లుగా తాజాగా జియోలాజిక‌ల్ అధికారులు గుర్తించారు. దాదాపు అర కిలోమీటరు కన్నా ఎక్కువగా ఉన్న భారీ గొయ్యి ఏర్ప‌డింద‌ని నిర్ధారించుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం ప్లియడీస్‌ ఈ నెల 9న తీసిన చిత్రాల్లో ఈ అంశం స్పష్టమవుతున్నది. యూరోపియన్‌ యూనియన్‌ శాటిలైట్‌ సెంటినెల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌ ఉత్పాతం వల్ల ఏర్పడిన శిథిలాలు ఒక ప్రవాహాన్ని అడ్డుకోవడంతో.. ఆ ప్రవాహం నిలిచuttarakhand;manu;vishnu;uttarakhand;district;kanna lakshminarayana;central governmentమ‌రోసారి జల‌ విల‌యం త‌ప్ప‌దా..? హిమాల‌యాల నుంచి సంకేతం..!మ‌రోసారి జల‌ విల‌యం త‌ప్ప‌దా..? హిమాల‌యాల నుంచి సంకేతం..!uttarakhand;manu;vishnu;uttarakhand;district;kanna lakshminarayana;central governmentSat, 13 Feb 2021 10:45:43 GMTకన్నా ఎక్కువగా  ఉన్న భారీ గొయ్యి ఏర్ప‌డింద‌ని నిర్ధారించుకున్నారు.  ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం ప్లియడీస్‌ ఈ నెల 9న తీసిన చిత్రాల్లో ఈ అంశం స్పష్టమవుతున్నది. యూరోపియన్‌ యూనియన్‌ శాటిలైట్‌ సెంటినెల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌ ఉత్పాతం వల్ల ఏర్పడిన శిథిలాలు ఒక ప్రవాహాన్ని అడ్డుకోవడంతో.. ఆ ప్రవాహం నిలిచిపోయి, అక్కడ తాత్కాలికంగా ఒక సరస్సు ఏర్పడిందని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ శాస్త్రజ్ఞులు తెలిపారు. వాస్త‌వానికి జలవిలయం జరిగిన మ‌రుస‌టి రోజే హెలికాప్టర్‌ ద్వారా ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు.


ఈ స‌ర్వేలో శాస్త్రజ్ఞులు ఆ సరస్సును గుర్తించారు. ఆ శిథిలాలు తొలగిపోతే సరస్సులోని నీరంతా రిషిగంగ నదిలోకి ప్రవహించి మరోసారి ప్రమాదం జరిగేట్లుగా ఉంద‌న్న భ‌యాందోళ‌న‌ల‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు.  అయితే అందులో నీరు ఎంత మేర‌కు ఉంది. ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఎంత అన్న త‌దిత‌ర అంశాల‌పై జియోలజీ శాస్త్ర‌జ్ఞులు అధ్య‌య‌నం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్తరాఖండ్ చమోలి జిల్లా తపోవన్‌లో కేంద్రం భద్రతా బలగాలు చేపడతున్న రెస్క్యూ ఆపరేషన్ 6వ రోజుకు చేరుకుంది. తపోవన్ వద్ద తపోవన్‌-విష్ణుగఢ్‌ ప్రాజెక్ట్‌ టన్నెల్‌లో వరద సంభవించింది. దీంతో ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న సుమారు 204 మంది వరదల్లో చిక్కకున్నారు.


బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర- రాష్ట్ర భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో 38మంది డెడ్ బాడీలు వెలికితీసినట్లు ప్రకటించింది. మిగిలిన వారి కోసం కేంద్రబలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మరో 168 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలిస్తున్న ఐటీబీపీ సిబ్బంది శుక్రవారం రెండు మృతదేహాలను వెలికితీశారు. మనుషులే కాక.. ఈ ప్రమాదంలో దాదాపు 184 జీవాలు మరణించినట్టు అధికారులు తెలిపారు.


నా భార్య పని చేయడం లేదు అని చెప్తే సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానం తో ఖంగు తిన్న భర్త

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>