PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janareddy098575d1-020a-4012-9eeb-80f1abe44003-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janareddy098575d1-020a-4012-9eeb-80f1abe44003-415x250-IndiaHerald.jpgజానారెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. సాగ‌ర్‌లో తానే బ‌రిలోకి దిగుతున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ విధానాల‌ను, ప‌థ‌కాల్లోని లోప‌భూయిష్ట‌త‌ను ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో తొలిసారి విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది కూడా కాంగ్రెస్సే అని తెలిపారు. రాష్ట్రంలో రైతjana reddy;nagarjuna akkineni;vidya;telangana rashtra samithi trs;telangana;congress;media;gold;electricity;janareddy;marchఇవిగో మీ త‌ప్పులు... అవిగో మా ఒప్పులు... జానారెడ్డి భ‌లే చెప్పారుగాఇవిగో మీ త‌ప్పులు... అవిగో మా ఒప్పులు... జానారెడ్డి భ‌లే చెప్పారుగాjana reddy;nagarjuna akkineni;vidya;telangana rashtra samithi trs;telangana;congress;media;gold;electricity;janareddy;marchFri, 12 Feb 2021 19:39:03 GMTజానారెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. సాగ‌ర్‌లో తానే బ‌రిలోకి దిగుతున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ విధానాల‌ను, ప‌థ‌కాల్లోని లోప‌భూయిష్ట‌త‌ను ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో తొలిసారి విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది కూడా కాంగ్రెస్సే అని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు అందించడాన్ని అభినందిస్తున్నాం కానీ.. రుణమాఫీ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.


అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని కేసీఆర్‌ గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్‌ఎస్‌ ఏం చేసేదని జానారెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ ఊసే లేదని తెలిపారు.రుణమాఫీ లేక రైతులపై మరింత భారం పడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఇష్టా వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని జానారెడ్డి హెచ్చరించారు.


కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని.. కల్యాణలక్ష్మిగా పేరు మార్చి కొనసాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పథకాలు బాగుంటే మెచ్చుకుంటాం.. పాలనలో లోపాలు ఉంటే తప్పక ప్రశ్నిస్తామని హెచ్చరించారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలు ఆలోచించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడటం సరికాదని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని, నా పార్టీకి నా సేవలు అవసరం కాబట్టి పోటీకి నిలబడ్డాను అని వెల్లడించారు. పదవులపై తనకు ఎన్నడూ ఆశలేదని తెలిపారు.ఇక నాగార్జున సాగ‌ర్‌లో ఎన్నిక‌ల వేడి క్ర‌మంగా పెరుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది


చిత్తు చిత్తైన చంద్రబాబు!

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>