PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/politics8ccb6ec8-47a4-4eb7-b27f-86c9401fa64e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/politics8ccb6ec8-47a4-4eb7-b27f-86c9401fa64e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ నిర్ణయం తీవ్ర రాజకీయ చర్చకు తావిస్తోంది. వైఎస్ షర్మిల నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ లో "రాజన్న రాజ్యం తెస్తా " అనే నినాదాన్ని బట్టి చూస్తే ఆమె పార్టీ పెట్టడం ఖాయం అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆమె పార్టీ పెడితే త్రిముఖ పోరు తద్యం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ లో అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ పార్టీ కి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనpolitics;pawan;kcr;kalyan;delhi;visakhapatnam;bharatiya janata party;telangana;janasena;vishakapatnam;media;minister;letter;central government;janasena party;party;mantraషర్మిల కొత్త పార్టీ పై పవన్ స్పందన ..!!షర్మిల కొత్త పార్టీ పై పవన్ స్పందన ..!!politics;pawan;kcr;kalyan;delhi;visakhapatnam;bharatiya janata party;telangana;janasena;vishakapatnam;media;minister;letter;central government;janasena party;party;mantraThu, 11 Feb 2021 09:06:36 GMT ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ నిర్ణయం తీవ్ర రాజకీయ చర్చకు తావిస్తోంది. వైఎస్ షర్మిల నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ లో "రాజన్న రాజ్యం తెస్తా " అనే నినాదాన్ని బట్టి చూస్తే ఆమె పార్టీ పెట్టడం ఖాయం అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆమె పార్టీ పెడితే త్రిముఖ పోరు తద్యం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ లో అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ పార్టీ కి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

 ఎందుకంటే ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ పార్టీ మీద ప్రజలకు ఆసక్తి తగ్గుతుందని ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, అలాగే గ్రేటర్ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈ నేపద్యంలో వైఎస్ అభిమాన బలం ఉన్న షర్మిల పార్టీ పెడితే కచ్చితంగా టి‌ఆర్‌ఎస్ పార్టీ పై ప్రభావం చూపుతుందని పలువురి వాదన. అందుకే టి‌ఆర్‌ఎస్ నేతలు షర్మిల కొత్త పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షర్మిల కొత్త పార్టీ నిర్ణయం పై తాజాగా స్పంధించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్రమంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు.

 ఈ నేపథ్యంలో షర్మిలా పార్టీపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురవ్వడంతో .. దీనిపై స్పందించిన జనసేనాని.. షర్మిలా ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం అన్నారు. ఇక ప్రజస్వామ్యం లో  ప్రతీ ఒక్కరికీ పార్టీ పెట్టుకునే హక్కు ఉందని తెలిపారు.. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా అని పవన్ అన్నారు. ఆ వెంటనే కేసీఆర్ పాలనపై ప్రశ్న ఎదురు కాగా.. కేసీఆర్ పాలన గురించి హైదరాబాద్‌లోనే మాట్లాడతానని దాటవేశారు. కాగా, ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జనసేన అధినేత.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో పాటు.. ఏపీలో శాంతిభద్రతలు, దేవాలయాలపై దాడులు, బీజేపీ-జనసేన పార్టీ పొత్తు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.


కేసిఆర్ సారు.. ఈ మాటలేంటి.. మహిళలు కుక్కలా..?

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>