PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somuveerraju-bjp-ycp-tdp-jagan-naidu-pawan-bc-slog9bc9a971-8a9a-4599-9d95-a93b4929b243-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somuveerraju-bjp-ycp-tdp-jagan-naidu-pawan-bc-slog9bc9a971-8a9a-4599-9d95-a93b4929b243-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతలు గత కొంతకాలంగా సైలెంట్ కావడంపై అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు చేయలేకపోతున్నారు. గతంలో చంద్రబాబు విషయంలో పదే పదే విమర్శలు చేసిన చాలామంది నేతలు ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడును విమర్శించే సాహసం చేయడం లేదు. దీని వెనుక కారణం ఏంటీ అనేది అర్థం కాకపోయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో పాటు ప్రతిపక్షం ఓటుని కూడా టాchandrababu;cbn;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;partyచంద్రబాబుని సోము ఎందుకు కీర్తిస్తున్నారూ...?చంద్రబాబుని సోము ఎందుకు కీర్తిస్తున్నారూ...?chandrababu;cbn;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;partyWed, 10 Feb 2021 10:06:34 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతలు గత కొంతకాలంగా సైలెంట్ కావడంపై అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు చేయలేకపోతున్నారు. గతంలో చంద్రబాబు విషయంలో పదే పదే విమర్శలు చేసిన చాలామంది నేతలు ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడును విమర్శించే సాహసం చేయడం లేదు. దీని వెనుక కారణం ఏంటీ అనేది అర్థం కాకపోయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో పాటు ప్రతిపక్షం ఓటుని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది.

అప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా సరే ఆ పార్టీనే టార్గెట్గా చేసుకుని విమర్శలు చేసే విషయంలో భారతీయ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేసారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు పరిపాలన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీని కారణంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. 

గతంలో సైలెంట్గా ఉన్న నేతలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాస్త విస్మయానికి గురి చేస్తున్నాయి. కలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అయితే ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు కూడా సమాచారం.



షర్మిల రాకతో..జగనోరికి కొత్త చిక్కు ..?

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>