PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsd647b0c4-8d57-4aec-b0e7-278897f7f461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsd647b0c4-8d57-4aec-b0e7-278897f7f461-415x250-IndiaHerald.jpg పిల్లలను భావితరాలకు ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే గురువులు ప్రస్తుతం రోడ్డెక్కి తమ ఆవేధనను విన్నవించుకొనే ధీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎన్నో మార్లు తమ సమస్యలను ప్రభుత్వాలకు తీసుకెళ్లినా ఫలితం లభించకపోవడంతో ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర జేస్తున్నారు ఉపాద్యాయులు. ఇటీవల సిద్దిపేట పరిధిలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తా లో పిఆర్టీయూ ఆద్వర్యంలో గురువులు నిర్వహించిన ధర్నా వారి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్తున్నాయి. ధర్నా లో ఉపాద్యాయుల.. చెప్పిన సమస్యలను ఒకసారి పరిశీలిస్తే.. ప్రభుత్వం ప్రవేశ పెgenaral news;amala akkineni;district;panchayati;letter;local language;central government;siddipetటిచెర్ల వెతలు : రోడ్డెక్కిన ఉపాద్యాయులు.. తీరేనా వీరి కష్టాలు ..?టిచెర్ల వెతలు : రోడ్డెక్కిన ఉపాద్యాయులు.. తీరేనా వీరి కష్టాలు ..?genaral news;amala akkineni;district;panchayati;letter;local language;central government;siddipetWed, 10 Feb 2021 22:24:42 GMT పిల్లలను భావితరాలకు ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే గురువులు ప్రస్తుతం రోడ్డెక్కి తమ ఆవేధనను విన్నవించుకొనే ధీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎన్నో మార్లు తమ సమస్యలను ప్రభుత్వాలకు తీసుకెళ్లినా ఫలితం లభించకపోవడంతో ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర జేస్తున్నారు ఉపాద్యాయులు. ఇటీవల సిద్దిపేట పరిధిలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తా లో పిఆర్టీయూ ఆద్వర్యంలో గురువులు నిర్వహించిన ధర్నా వారి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్తున్నాయి. ధర్నా లో ఉపాద్యాయుల.. చెప్పిన సమస్యలను ఒకసారి పరిశీలిస్తే.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఉపాద్యాయులు డిమాండ్‌ చేశారు.

ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన ప్రభుత్వ పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని వారు మండి పడుతున్నారు. కాబట్టి పదోన్నతులు కల్పించడంపై దృష్టి పెట్టాలని ఉపాద్యాయులు కోరుతున్నారు. అంతే కాకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వడంలో కూడా చిన్న చూపు వహిస్తున్నాయని, రూ.398తో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పారు. ఇంకా చాలా మంది ఉపాద్యాయులకు ఇంత వరకు హెల్త్ కార్డులు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా   మెడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు.

 కేజీబీవీల్లో పనిచేస్తున్న చాలా మంది ఉపాధ్యాయులకు టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని  పేర్కొన్నారు. ఆరు నెలలతో కూడిన ప్రసూతి సెలవులు, 2016లో మధ్యాహ్నభోజన పథకంలో ఎండాకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా మూడు సంవత్సరాలకి పాఠశాలలో చేరే విధంగా పూర్వప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి ప్రధానోపాధ్యాయులను నియమించాలన్నారు. మరి ఉపాద్యాయుల డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు అమలు చేతుందో చూడాలి...


ఉప్పెన బుచ్చి బాబు నెక్స్ట్ ఆ స్టార్ తోనా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>