PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpgజనవరి 26,గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట హింసపై తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారని, దేశ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ సహా మరో ఆరుగురు జర్నలిస్ట్‌లపై దేశద్రోహం కేసులు నమోదయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో శశిథరూర్ సహ సీనియర్ జర్నలిస్ట్‌లకు మంగళవారం ఊరట లభించింది. వారి అరెస్ట్‌‌పై స్టే విధించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేల త్రిసభ్య ధర్మాసనం.. రెండు వారాల తర్వాత ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. sasi tharoor;delhi;madhya pradesh - bhopal;kapil sibal;congress;mp;telugu;police;january;court;bhopal;joshఆ కేసు విషయమై ఎట్టకేలకు సుప్రీంలో శశిథరూర్, మరో ఆరుగురు జర్నలిస్టులకు ఊరటఆ కేసు విషయమై ఎట్టకేలకు సుప్రీంలో శశిథరూర్, మరో ఆరుగురు జర్నలిస్టులకు ఊరటsasi tharoor;delhi;madhya pradesh - bhopal;kapil sibal;congress;mp;telugu;police;january;court;bhopal;joshTue, 09 Feb 2021 18:00:00 GMTజనవరి 26,గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట హింసపై తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారని, దేశ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ సహా మరో ఆరుగురు జర్నలిస్ట్‌లపై దేశద్రోహం కేసులు నమోదయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో శశిథరూర్ సహ సీనియర్ జర్నలిస్ట్‌లకు మంగళవారం ఊరట లభించింది. వారి అరెస్ట్‌‌పై స్టే విధించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేల త్రిసభ్య ధర్మాసనం.. రెండు వారాల తర్వాత ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు విషయమై ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్ పోలీసులు తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తూ ఎంపీ, జర్నలిస్ట్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. నిందితులకు ఎటువంటి ఊరట కలిగించవద్దని, రేపటికి వాయిదా వేయాలని కోరారు. శశిథరూర్, జర్నలిస్ట్‌ల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించే వరకు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని అభ్యర్ధించారు.




దీనిపై స్పందించిన ధర్మాసనం ‘మేము నోటీసులు జారీ చేశాం.. ఎటువంటి చర్యలు తీసుకోరు’ వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్నా, జస్టిర్ వీ రామసుబ్రమణియన్‌ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. కాగా, నిందితులు చేసిన ట్వీట్లు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భయంకరమైన ప్రభావాలను చూపించాయని సొలిసిటర్ జనరల్ వాదించారు. అయితే, వీటిని కపిల్ సిబాల్ ఖండిస్తూ.. ఏది ముప్పో న్యాయస్థానం విచారించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా, తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారని, దేశ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోయిడాలో ఒకటి, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, హోషంగాబాద్, ముల్తాయ్, బేతుల్‌లో నాలుగు ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో పాటు మృణాల్ పాండే, వినోద్ జోష్, జాఫర్ ఆఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్‌ల పేర్లను ఎఫ్ఐఆర్‌లలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు రైతును కాల్చి చంపడం వల్లే రైతులు ఎర్రకోటను ముట్టడించారని పేర్కొంటూ శశిథరూర్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.




పంచాయతీ ఎన్నికలు : కొన్ని చోట్ల ఉద్రిక్తత..కొన్ని చోట్ల ప్రశాంతత !!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>