PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరో వ్యాఖ్య కూడా వినపడుతుంది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే నేతలు కూడా ఇప్పుడు ఆగిపోయారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ లోకి వెళ్ళాలని భావbjp;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;vishakapatnam;uttarandhra;tdp;central government;ycp;partyటీడీపీ నెత్తిన బిజెపి పాలు పోసిందా...?టీడీపీ నెత్తిన బిజెపి పాలు పోసిందా...?bjp;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;vishakapatnam;uttarandhra;tdp;central government;ycp;partySun, 07 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరో వ్యాఖ్య కూడా వినపడుతుంది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే నేతలు కూడా ఇప్పుడు ఆగిపోయారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ లోకి వెళ్ళాలని భావించిన తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారని సమాచారం.

పార్టీ లోకి వెళ్ళడానికి అన్ని విధాలుగా అవకాశం కోసం చూస్తున్న నేతలు కూడా ఇప్పుడు పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్. బీజేపీ నేతలతో చర్చలు జరిపిన వాళ్లు కూడా ఇప్పుడు బీజేపీ నేతలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అని కూడా అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే వాళ్ళు వెళ్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు కొంతమంది మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంత మంది వైసీపీ నేతలు పదవులు లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆసక్తి గా ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీ తో పోరాటం చేసే విషయంలో జగన్ విఫలమవుతున్నారని భావిస్తున్నారు. కొంతమంది నేతలు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మూడు రాజధానులు తెచ్చినా విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తే వైసిపి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైసీపీ నేతలు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంతమంది నేతలు బిజెపిలోకి కాకుండా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>