PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tension7c6619e9-60c2-4de5-b5c0-328a88818021-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tension7c6619e9-60c2-4de5-b5c0-328a88818021-415x250-IndiaHerald.jpgమన పొరుగు దేశమైన మాయన్మార్‌లో ఆ దేశ సైన్యం అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకోవడంపై ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మయన్మార్ వీధుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సైనిక ప్రభుత్వం అణచివేత చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన సైనిక ప్రభుత్వం.. శనివారం అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేసింది. ఫేస్‌బుక్‌పై ఆంక్షలు సహా ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలపై నిషేధం విధించింది.mayanmar;telugu;local language;partyమయన్మార్ లో అంతకంతకు తీవ్రమవుతున్న నిరసనలు... ఇంటర్నెట్ సేవలు నిలిపివేతమయన్మార్ లో అంతకంతకు తీవ్రమవుతున్న నిరసనలు... ఇంటర్నెట్ సేవలు నిలిపివేతmayanmar;telugu;local language;partySun, 07 Feb 2021 23:00:00 GMTపార్టీ విజయం సాధించిన నేపధ్యంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ దేశ సైన్యం అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకోవడంపై ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మయన్మార్ వీధుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సైనిక ప్రభుత్వం అణచివేత చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన సైనిక ప్రభుత్వం.. శనివారం అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేసింది. ఫేస్‌బుక్‌పై ఆంక్షలు సహా ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలపై నిషేధం విధించింది.


 
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సాకుతో ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం స్వయంగా పరిపాలనను చేపట్టింది. మరోవైపు యాంగూన్‌లో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున కార్మికులు, విద్యార్థులు ప్రముఖంగా పాల్గొన్నారు. సైన్యం నిరంకుశత్వం నశించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. బొటనవేలు, చిటికెనవేలును మడిచి మధ్యన ఉన్న మూడు వేళ్లను చేతులు పైకెత్తి చూపడాన్ని నిరసనగా చిహ్నంగా ఎంచుకున్నారు. పొరుగున ఉన్న థాయిలాండ్‌లో నిరసన తెలపడానికి ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తుండడంతో దాన్ని స్వీకరించారు. మరోవైపు, మయన్మార్‌లో తిరిగి పౌర పాలన నెలకొనేలా ప్రపంచ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొస్తామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ప్రకటించారు. మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షార్నర్‌ బర్గనర్‌ మిలటరీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు, జైలులో ఉన్నవారందర్నీ విడుదల చేయాలని సూచించారు.



మాయన్మార్‌లో రెండు విదేశీ టెలికం సంస్థలు టెలీనార్, ఓరేడూల తమ నెట్‌వర్క్ నిలిచిపోయినట్టు తెలిపాయి. జాతీయస్థాయిలో నెట్‌వర్క్‌ ను నిలిపివేసినట్టు టెలినార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ భద్రత, ప్రజా ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తప్పుడు వార్తల ప్రసారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. టెలినార్ మాయన్మార్ స్థానిక సంస్థ.. అక్కడ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తుంది.. క్లిష్ట పరిస్థితులలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కాగా, మాయాన్మార్‌లో ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలనలోనే కొనసాగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ పదిహేనేళ్లపాటు నిర్బంధంలో ఉన్నారు. ఆమెను 2010లో సైన్యం నిర్బంధం నుంచి విడుదల చేయడంతో 2015 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టారు. మాయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి పురస్కారం కూడా లభించింది.


టెన్త్ పాసయితే గవర్నమెంట్ జాబ్ !

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>