PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjp-somu-veerrajuf7ebc7bf-ca17-42ad-9e68-052d4dbc1434-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjp-somu-veerrajuf7ebc7bf-ca17-42ad-9e68-052d4dbc1434-415x250-IndiaHerald.jpgకేంద్రం ఏపీకి షాకుల మీద షాకులిస్తోంది. కొత్త పరిశ్రమలు ఇవ్వకపోగా.. ఉన్న పరిశ్రమలకు ఎగనామం పెడుతోంది. ప్రత్యేక హోదాకు దిక్కులేదు.. విశాఖ జోన్ ఊసులేదు.. కొత్త పరిశ్రమల పలుకు లేదు.. బడ్జెట్‌లో ఏపీ బతాఖానీ లేదు.. ఇవన్నీ లేక పోగా..ఆంధ్రుల హక్కుగా పేరుబడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపేసింది. ఇప్పుడు ఈ పరిణామం స్థానిక బీజేపీ నేతలకు సంకటంగా మారింది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక ఏపీ బీజేపీ నాయకులు జుట్టుపీక్కుంటున్నారు. అయితే పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారుbjp-somu-veerraju;bharatiya janata party;andhra pradesh;narendra modi;rajya sabha;vishakapatnam;media;prime minister;chief minister;petrol;minister;local language;central government;partyఏపీకి షాకు మీద షాకులిస్తున్న మోదీ.. పాపం సోము..?ఏపీకి షాకు మీద షాకులిస్తున్న మోదీ.. పాపం సోము..?bjp-somu-veerraju;bharatiya janata party;andhra pradesh;narendra modi;rajya sabha;vishakapatnam;media;prime minister;chief minister;petrol;minister;local language;central government;partySat, 06 Feb 2021 09:00:00 GMTవిశాఖ జోన్ ఊసులేదు.. కొత్త పరిశ్రమల పలుకు లేదు.. బడ్జెట్‌లో ఏపీ బతాఖానీ లేదు.. ఇవన్నీ లేక పోగా..ఆంధ్రుల హక్కుగా పేరుబడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపేసింది. ఇప్పుడు ఈ పరిణామం స్థానిక బీజేపీ నేతలకు సంకటంగా మారింది.


దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక ఏపీ బీజేపీ నాయకులు జుట్టుపీక్కుంటున్నారు. అయితే పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.  ఈ అంశంపై తాము ఈనెల 14వ తేదీన దిల్లీ వెళ్లి జాతీయ కమిటీని కలిసి విన్నవిస్తామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. తమది నోటా పార్టీ అంటూ అధికారపక్ష నేతలు చేస్తోన్న విమర్శలపై వీర్రాజు ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో నోరు జారొద్దని హెచ్చరించారు.


మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గతంలో ఈ పార్టీ లోనే పోటీ చేసి 3 వేల ఓట్లతో ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని అన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత తమ పార్టీదేనని ఇందుకు గర్విస్తున్నామని... రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తోన్న పార్టీలు ఎవరైనా బిసీని ముఖ్యమంత్రి చేయగలరా? అని తాను ప్రశ్నించానని స్పష్టం చేశారు. ఈ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి తాను ముగింపు చెప్పేందుకు మరోసారి స్పందిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదన్నారు.


బీజేపీ సకల జనుల పార్టీ అని... అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై ఆ శాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు. దేశంలోని అన్ని పరిశ్రమలపైనా ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు ధరలపై ఆలోచించాలన్నారు. కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకపోవడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. పెట్రోల్ ను జిఎస్ టి పరిధిలోకి తీసుకురావాలని తాము ప్రతిపాదించామని సోము వీర్రాజు చెబుతున్నారు.




జగడ్డ: ఎస్ఈసి పదవికి నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలి...?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>