PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscd952d95-c2cc-412d-be1f-62b0ea7c710d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscd952d95-c2cc-412d-be1f-62b0ea7c710d-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయతీలతో కధ మొదలుపెట్టిన ఎన్నికల సంఘం ఇపుడు తరువాత జరగబోయే వాటి మీద కూడా ఇపుడు దృష్టి పెట్టింది. ఏపీలో గత ఏడాది మార్చి 15న కరొనా వైరస్ పేరు మీద ఎన్నికలను వాయిదా వేశారు. ఆనాడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కానీ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకే నామినేషన్లు దాఖలు అయ్యాయి. jagan-nimmagadda-elections;panchayati;ycp;march;party;racchaజగడ్డ : ఏకగ్రీవాల మీద పెద్ద బాంబ్ వేసిన నిమ్మగడ్డ...?జగడ్డ : ఏకగ్రీవాల మీద పెద్ద బాంబ్ వేసిన నిమ్మగడ్డ...?jagan-nimmagadda-elections;panchayati;ycp;march;party;racchaThu, 04 Feb 2021 13:41:14 GMTమార్చి 15న కరొనా వైరస్ పేరు మీద ఎన్నికలను వాయిదా వేశారు. ఆనాడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కానీ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకే నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఆ సమయంలో పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ  ఎన్నికల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. అది నాడు ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ అయింది. దాని మీద విపక్షాలు అన్నీ కూడా నిరసన తెలియచేశాయి. ఏపీలో ఏకగ్రీవాలు అన్నీ కూడా దౌర్జన్యంగా బలవంతంగా చేసుకున్నవే అని కూడా విపక్షాలు  చెప్పుకొచ్చాయి.  సరిగ్గా ఆ టైమ్ లో నిమ్మగడ్డ ఒక్కసారిగా ఎన్నికలను వాయిదా వేశారు.

ఇపుడు చూస్తే పంచాయతీ ఎన్నికల నుంచి మొత్తం కధ మొదలుపెట్టారు. దీన్ని కూడా వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. అయితే దీని తరువాత వెంటనే ఇచ్చే నోటిఫికేషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలదేనని అంతా అంటున్నారు. మరి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే  గతంలో జరిగిన ఏకగ్రీవల సంగతి ఏంటి అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.

ఇలా ఏకగ్రీవాలు అయిన వాటిలో నూటికి తొంబై అయిదు శాతం వైసీపీవే ఉన్నాయి. దాంతో అధికార పార్టీ మధన పడుతోంది. అయితే గతంలో జరిగిన అన్ని ఏకగ్రీవాలను విత్ హెల్డ్ లో పెడుతున్నట్లుగా తాజాగా నిమ్మగడ్డ చేసిన ప్రకటన ఇపుడు అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లూ అయింది. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు నాడు జరిగాయని మురిసిపోతున్న వైసీపీకి నిమ్మగడ్డ కోలుకోలేని దెబ్బ తీశారని అంటున్నారు. అంటే నాడు లక్షలు పోసి వైసీపీ అభ్యర్ధులు  అవతల వారిని బుజ్జగించి. బేరాలు పెట్టి చేసుకున్న ఏకగ్రీవాలు అన్నీ కూడా దండుగే అన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే ఫ్రెష్ నోటిఫికేషన్ తో మళ్ళీ ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఈ పరిణామం ఫ్యాన్ పార్టీ పెడ రెక్కలు విరిచేసేదేనని  కూడా అంటున్నారు.




బంగారం కొనాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్..ఈరోజు ధరలు ఇలా...!!

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>