BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/glowing-skin924ca278-f419-4e39-b91a-b9563604b59e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/glowing-skin924ca278-f419-4e39-b91a-b9563604b59e-415x250-IndiaHerald.jpgచలికాలం వచ్చిందంటే చాలు,చర్మం పొడిబారినట్లు అవ్వడం, లేదా చర్మం పాలిపోయినట్లు అవ్వడం, అంతేకాకుండా దురద పెట్టడం,మంటపుట్టడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం ఎన్నో రకాల వ్యాసిలీన్ లను వాడినప్పటికీ,శాశ్వత పరిష్కారం దొరకదు. అయితే ఏది వాడినా తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చుస్తాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మం మీద దురద,మంట పుట్టడం లాంటి సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిglowing skin;cheque;almondsఅలా చేస్తే చలికాలంలో కూడా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చట..!అలా చేస్తే చలికాలంలో కూడా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చట..!glowing skin;cheque;almondsWed, 03 Feb 2021 12:23:00 GMTచలికాలం వచ్చిందంటే చాలు,చర్మం పొడిబారినట్లు అవ్వడం, లేదా చర్మం పాలిపోయినట్లు అవ్వడం, అంతేకాకుండా దురద పెట్టడం,మంటపుట్టడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం ఎన్నో రకాల వ్యాసిలీన్ లను  వాడినప్పటికీ,శాశ్వత పరిష్కారం దొరకదు. అయితే ఏది  వాడినా తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చుస్తాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మం మీద దురద,మంట పుట్టడం లాంటి సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి,చర్మ సమస్యలను దూరం చేసుకుని, తాజాగా  ఉండవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


గుప్పెడు బాదం పప్పులను, రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేయాలి. అయితే తొక్కతో సహా పేస్ట్ చేయాల్సి ఉంటుంది.  అలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమానికి,ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి,పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇక ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖం మీద ఎటువంటి గుల్లలు, మచ్చలు,గీతలు ఉన్నా  అన్నీ  పోతాయి. ఇక అంతే కాకుండా ఈ ప్యాక్ చర్మాన్ని లోపల నుంచి కణాలు తెల్లబడే లాగా చేస్తుంది.


రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని, అందులో కొద్దిగా అలోవెరా జెల్ తో పాటు ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలు అన్నీ కలిపి బాగా మిశ్రమంలా, పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరానివ్వాలి. అయితే ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత నీటితో కడగకూడదు. కేవలం ఒక కాటన్ క్లాత్ తీసుకుని, చల్లని నీటిలో అద్ది సుతిమెత్తగా తుడిచి వేయాలి. ఇక ఈ ప్యాక్  వేసుకున్న మరుసటిరోజు మాత్రమే సబ్బుతో కడుక్కోవడం  ఉత్తమం.  ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది, చర్మం తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.


అంతేకాకుండా అప్పుడప్పుడు ఐస్ క్యూబ్ తో  ముఖం పైన మసాజ్ చేసి, అరటిపండు తొక్కతో మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.




రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>