PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sulabh-complexe8f7255d-9c40-466f-abd6-5a91e9d68b91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sulabh-complexe8f7255d-9c40-466f-abd6-5a91e9d68b91-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనకు చికెన్, మటన్ కావాలి అంటే దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటాం. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. సాధారణంగా మాంసం తినాలనుకునేవారు ఏ మటన్ షాపో, చికెన్ షాపుకు వెళ్లి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కొనుక్కోవాలన్నా.. కిరాణం లేదా చికెన్ షాపులే దిక్కు. కానీ ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్, గుడ్ల షాపును నిర్వహిస్తున్నాడు.sulabh complex;indore;madhya pradesh - bhopal;chicken;central governmentసులభ్ కాంప్లెక్స్ లోనే మటన్ షాపు పెట్టిన వ్యక్తి.. ఎక్కడంటే..!?సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్ షాపు పెట్టిన వ్యక్తి.. ఎక్కడంటే..!?sulabh complex;indore;madhya pradesh - bhopal;chicken;central governmentFri, 29 Jan 2021 07:00:00 GMTచికెన్, మటన్ కావాలి అంటే దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటాం. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. సాధారణంగా మాంసం తినాలనుకునేవారు ఏ మటన్ షాపో, చికెన్ షాపుకు వెళ్లి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కొనుక్కోవాలన్నా.. కిరాణం లేదా చికెన్ షాపులే దిక్కు. కానీ ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్, గుడ్ల షాపును నిర్వహిస్తున్నాడు. మలమూత్ర విసర్జన చేసే ప్రదేశంలో మటన్, చికెన్, గుడ్లు అమ్మడం, కొనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఇలాంటి ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తన యజమాని సులభ్ కాంప్లెక్స్ నిర్వహించుకోమని అప్పగిస్తే.. అతడు డబ్బులు సంపాదించాలని సులభ్ కాంప్లెక్స్ ని కాస్త మటన్, గుడ్లు అమ్మే కేంద్రంగా మార్చేశాడు. ఒక వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే డబ్బులతోపాటు సొంతంగా మటన్ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు చెకింగ్ నిర్వహించగా.. అప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిధిలోని ఓ సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడి నిర్వాకం ఇది. సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తూనే.. మనీ కౌంటర్ దగ్గర మటన్, గుడ్లను అమ్మడం ప్రారంభించాడు. అది చూసిన కొందరూ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండోర్ మున్సిపాలిటీ అధికారులు ఆ సులభ్ కాంప్లెక్స్ పై తనిఖీ నిర్వహించారు. మటన్, గుడ్లతో అడ్డంగా పట్టుబడటంతో అతడికి రూ.1000 జరిమానా విధించారు. అలాగే సులభ్ కాంప్లెక్స్ నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు రూ.20 వేల జరినామాను విధించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరూ ఆ వ్యక్తికి శిక్ష విధించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడని పేర్కొంటున్నారు.


జగడ్డ : తొలి విడత నామినేషన్లు షురూ.. జగన్ లో మొదలైన టెన్షన్..?

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?

రాజమౌళి నిక్ నేమ్ జక్కన్న కాదు మరేమిటో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: అసాంఘిక శక్తుల అరాచక దందాల నుండి, అభాగ్యులకు రక్షణ కరువేనా?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టోనా ? ఏమైందయ్యా బాబు ?

జగడ్డ : నిమ్మగడ్డను వదలని జగనోరు.. కేంద్రానికి లేఖ !

జగడ్డ : నేడే పంచాయతీ పోరు షురూ.. తొలిదశ ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>