PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanfd573e2d-b510-4469-85db-db3ac080ac4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanfd573e2d-b510-4469-85db-db3ac080ac4c-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయితీ ఎన్నికల పోరు బాగా హాట్ హాట్‌గా సాగేలా కనిపిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ పంచాయితీ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ స్థానిక పోరు ఏకపక్షంగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ స్పష్టంగా ఉంది. దీంతో ప్రజలు ఫ్యాన్ వైపుకు వెళ్లారు. pawan kalyan;pawan;cbn;nithya new;pawan kalyan;bharatiya janata party;jagan;janasena;2019;government;assembly;tdp;local language;ycp;janasena partyబాబుని ముంచనున్న పవన్..జగన్‌కు బాగా సెట్ అయిందిగా?బాబుని ముంచనున్న పవన్..జగన్‌కు బాగా సెట్ అయిందిగా?pawan kalyan;pawan;cbn;nithya new;pawan kalyan;bharatiya janata party;jagan;janasena;2019;government;assembly;tdp;local language;ycp;janasena partyThu, 28 Jan 2021 00:00:00 GMT2019 సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ పంచాయితీ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ స్థానిక పోరు ఏకపక్షంగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ స్పష్టంగా ఉంది. దీంతో ప్రజలు ఫ్యాన్ వైపుకు వెళ్లారు.

కానీ ఇప్పుడు ఆ వేవ్ కొంతవరకు తగ్గిందనే చెప్పొచ్చు. మరీ జగన్‌పై వ్యతిరేకిత రాకపోయినా, టీడీపీకి కాస్త అనుకూలంగా పరిస్తితి ఉంది. టీడీపీ నిత్యం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంది. అటు జగన్ సైతం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి, మిగతా విషయాలని గాలికొదిలేశారు. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కొంతమంది ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా లేరు.

ఇక ఈ ప్రభావం పంచాయితీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించేలా ఉంది. ఇదే టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా కనిపిస్తోంది. కాకపోతే పవన్ కల్యాణ్, చంద్రబాబు కొంప ముంచేలా ఉన్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేన పోటీలో ఉండటం వల్ల, బాబుకే ఎక్కువ డ్యామేజ్ జరిగి, ఓట్లు చీలిపోయి చాలా నియోజకవర్గాల్లో టీడీపీ తక్కువ మెజారిటీలతో ఓడిపోగా, వైసీపీ విజయం సాధించింది.

అయితే ఇప్పుడు బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా వీరు ఎంతో కొంత ఓట్లు చీల్చుకునే అవకాశం ఉంది. అది కూడా టీడీపీకి పెద్దగా బొక్క పడేలా ఉంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే, చివరికి వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్లైతే పంచాయితీ ఎన్నికల్లో పవన్ వల్ల బాబుకే ఎక్కువ డ్యామేజ్ జరిగేలా ఉంది. అలాగే జగన్‌కు బాగా బెన్‌ఫిట్ కానుందని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ వల్ల పంచాయితీ పోరు ఎలా మారుతుందో?




జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>