SpiritualitySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ayodhya8214a1be-e040-4f0a-bc4f-b68cd8ffeadc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ayodhya8214a1be-e040-4f0a-bc4f-b68cd8ffeadc-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపుకుంటున్న వేళ.. అయోధ్యలో మరో అద్భుత సంఘటనకు అంకురార్పణ జరిగింది. అదే నేడు అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంగళవారం (జనవరి 26) ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ayodhya;anil music;rohit;vedhika;january;university;village;doctor;mosque;thota chandrasekhar;professor;ayodhya;hindus;lucknowగణతంత్ర దినోత్సవం నాడు అద్భుత ఘట్టానికి వేదిక అయిన అయోధ్య...గణతంత్ర దినోత్సవం నాడు అద్భుత ఘట్టానికి వేదిక అయిన అయోధ్య...ayodhya;anil music;rohit;vedhika;january;university;village;doctor;mosque;thota chandrasekhar;professor;ayodhya;hindus;lucknowTue, 26 Jan 2021 22:30:00 GMT


ఇక అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ చారిత్రక తీర్పు వెలువడిన ఆర్నెళ్ల లోపే అక్కడ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడం గమనార్హం. ఇక మసీదు నిర్మాణానికి విరాళం అందించిన మొట్టమొదటి వ్యక్తి కూడా హిందువే కావడం గమనార్హం. లక్నో యూనివర్సిటీకి చెందిన రోహిత్ శ్రీవాస్తవ గతేడాది మసీదు నిర్మాణానికి రూ.21 వేలు విరాళంగా అందించారు. తాజాగా అవధ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్‌కే సింగ్, ఆయన సతీమణి డాక్టర్ సునీతా సెంగార్ రూ.22 వేల విరాళం అందించారు. ఆరెస్సెస్ నాయకుడు అనిల్ సింఘ్ రూ.2100 విరాళం అందించారు. భారత్‌లో మత సామరస్యానికి ఇది మంచి నిదర్శనమని పలువురు ప్రశంసలు కురిపించారు. ‘మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది’ అని జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ తెలిపారు. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండో - ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ గత డిసెంబర్‌లో మసీదు నమూనాను ఆవిష్కరించింది. సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం చేపడుతున్నారు. మసీదుపై భారీ గాజు గోపురం ఏర్పాటు చేయనున్నారు. బాబ్రీ మసీదు కంటే అనేక రెట్లు గొప్పగా మసీదు నిర్మాణం చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదు. ట్రస్ట్‌ సభ్యులందరూ త్వరలో సమావేశమై మసీదు పేరును నిర్ణయించనున్నారు. ఏది ఏమైనా గణతంత్ర దినోత్సవం నాడు మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగటం చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు


వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు...!!!

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>