PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/assembly21d04467-cf60-4f5f-8424-036f02a098c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/assembly21d04467-cf60-4f5f-8424-036f02a098c7-415x250-IndiaHerald.jpgఎప్పుడైనా అడ‌పా ద‌డ‌పా ఇచ్చినా.. వారు ప్ర‌ముఖంగా గుర్తింపు పొందింది లేదు. ఇక‌, కాంగ్రెస్ హ‌యాంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లాది విష్ణు, విశాఖ‌లో ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ‌ టికెట్లు సంపాయించుకున్నారు. మంథ‌ని నుంచి నాడు దుద్దిళ్ల శ్రీథ‌ర్ బాబు గెలిచి మంత్రి కూడా అయ్యారు. వీరిలో ఒక‌రిద్ద‌రు దూకుడుగా ఉన్నా.. వారికి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. ఇక‌, ప్ర‌స్తుతం వైసీపీ హ‌యాంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో న‌లుగురికి ఆయ‌న టికెట్లు ఇచ్చారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌, assembly;andhra pradesh;congress;2019;district;vishakapatnam;minister;letter;tdp;ycp;dookudu;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?assembly;andhra pradesh;congress;2019;district;vishakapatnam;minister;letter;tdp;ycp;dookudu;partyThu, 21 Jan 2021 11:21:00 GMTఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తూనే ఉంది. అసెంబ్లీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల గ‌ళం వినిపించేదెప్పుడని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ప్ర‌శ్నిస్తూనే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఏ పార్టీ కూడా ఆశించిన మేర‌కు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని రాజ‌కీయంగా ప్రోత్స‌హించ‌డం కానీ, వారికి టికెట్లు ఇవ్వ‌డం కానీ.. చేసింది లేదు. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొంత మెరుగైన ప‌రిస్థితి గ‌తంలో క‌నిపించినా.. టీడీపీలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎప్పుడూ కనిపించ‌లేదు. ఎప్పుడైనా అడ‌పా ద‌డ‌పా ఇచ్చినా.. వారు ప్ర‌ముఖంగా గుర్తింపు పొందింది లేదు.

ఇక‌, కాంగ్రెస్ హ‌యాంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లాది విష్ణు, విశాఖ‌లో ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ‌ టికెట్లు సంపాయించుకున్నారు. మంథ‌ని నుంచి నాడు దుద్దిళ్ల శ్రీథ‌ర్ బాబు గెలిచి మంత్రి కూడా అయ్యారు. వీరిలో ఒక‌రిద్ద‌రు దూకుడుగా ఉన్నా.. వారికి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. ఇక‌, ప్ర‌స్తుతం వైసీపీ హ‌యాంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో న‌లుగురికి ఆయ‌న టికెట్లు ఇచ్చారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌, విశాఖ తూర్పు నుంచి విజ‌య‌నిర్మ‌ల‌, అదేవిధంగా ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ కుమారుడు శ్రీనివాస‌రావుకు అవ‌కాశం క‌ల్పించారు.

వీరిలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి మ‌ల్లాది విష్ణు కేవ‌లం 25 ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, బాప‌ట్ల నుంచి కోన ర‌ఘుప‌తి.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే. మిగిలిన ఇద్ద‌రూకూడా ఎన్నిక‌ల పోరులో గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ఇక‌, టీడీపీ త‌ర‌పున టికెట్ ఎవ‌రికీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఇద్ద‌రే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం మొత్తానికి ప్రాతినిధ్యం వ‌హించాల్సి వ‌చ్చింది. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే. కోన ర‌ఘుప‌తిని డిప్యూటీ స్పీక‌ర్ చేశారు. దీంతో ఆయ‌న స‌భా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కే ప‌రిమితం అయ్యారు.

ఫ‌లితంగా అసెంబ్లీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం గ‌ళం వినిపించేందుకు మ‌ల్లాది విష్ణు ఒక్క‌రే మిగిలారు. పోనీ.. ఈయ‌నైనా.. బ్రాహ్మ‌ణ స‌మ‌స్య‌లు వినిపిస్తున్నారా? అంటే.. కేవ‌లం పార్టీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడ‌డానికే స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో తాము మ‌ల్లాదిని గెలిపించినా.. ఏం ప్ర‌యోజ‌నం అంటున్నారు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం బ్రాహ్మ‌ణులు.




ఒక కూతురికి తెలియకుండా మరో కూతురితో.. హైదరాబాద్‌లో దారుణం

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>