PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news1546ec7e-9354-4642-9dda-d0683d60eb95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news1546ec7e-9354-4642-9dda-d0683d60eb95-415x250-IndiaHerald.jpgవిద్యా సంస్థ‌ల పునఃప్రారంభానికి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ విద్యాశాఖ‌ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్school;andhra pradesh;telanganaఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం...ఈ సారి విద్యా సంస్థ‌ల‌కు వేస‌వి సెల‌వులు ర‌ద్దు...ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం...ఈ సారి విద్యా సంస్థ‌ల‌కు వేస‌వి సెల‌వులు ర‌ద్దు...school;andhra pradesh;telanganaMon, 18 Jan 2021 11:00:00 GMTఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ విద్యాశాఖ‌ ఆదేశాలు జారీ చేసింది.  అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి.  ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నిన్నటి వరకు అవకాశం ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. పని దినాలను 106 రోజులకు కుదిస్తూ అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.


సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని పేర్కొంది. 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. పరీక్షలు మేలో జరుగుతాయని స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది.


ఇదిలా ఉండ‌గా కరోనా తగ్గుముఖం పట్టిన దృష్ట్యా  విద్యా సంస్థలను ఫిబ్ర వరి ఒకటో తేదీ నుంచి తెరువాలని తెలంగాణ ప్ర‌భుత్వం సైతం నిర్ణయించింది. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ బోధన సాగుతుండగా, విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. జిల్లాలో 130 ప్రభు త్వ, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు 37 రెసిడెన్సియల్స్‌తో పాటు ఆశ్రమ పాఠశాలలు కలిపి 167 ఉన్నాయి. సర్కారు మార్గదర్శకాల మేరకు వాటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు 7967 మంది బాలురు, 9381 మంది బాలికలు ఉండగా వారంతా బడి మెట్లు ఎక్కనున్నారు. 


ఇదేంటి చినబాబు... ఆ రెండు కుటుంబాలతో లోకేష్ ఎందుకు మాట్లాడట్లేదు...?

కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>