CrimeShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/cm-jagan-scheme-killed-one-woman-in-chittor6b48d96b-7d21-43ff-95f9-6ed01abfd9a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/cm-jagan-scheme-killed-one-woman-in-chittor6b48d96b-7d21-43ff-95f9-6ed01abfd9a5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దానిలో అందరినీ ఆకట్టుకున్నది‘ అమ్మ ఒడి’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఎందరో పేద తల్లులకు ఇది ఉపయోగకరంగా ఉంది. రాష్ట్రంలో తమ పిల్లల్ని బడికి పంపించే తల్లులకు ప్రోత్సాహకంగా ఏపీ సీఎం జగన్ అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది.ఈనెల 11న నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది.కాగా.. ఇhathya;women;deva;jagan;kachi;andhra pradesh;nellore;government;police;chief minister;husband;wife;woman;murder.;news;local language;ammavodi;reddy;gharshanaదారుణం.... హత్యకు దారితిసిన అమ్మ ఒడి పథకం....!?దారుణం.... హత్యకు దారితిసిన అమ్మ ఒడి పథకం....!?hathya;women;deva;jagan;kachi;andhra pradesh;nellore;government;police;chief minister;husband;wife;woman;murder.;news;local language;ammavodi;reddy;gharshanaFri, 15 Jan 2021 09:09:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దానిలో అందరినీ ఆకట్టుకున్నది‘ అమ్మ ఒడి’.
ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంఎందరో పేద తల్లులకు ఇది ఉపయోగకరంగా ఉంది.  రాష్ట్రంలో తమ పిల్లల్ని బడికి పంపించే తల్లులకు ప్రోత్సాహకంగా ఏపీ సీఎం జగన్  అమ్మఒడి  పేరుతో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది.ఈనెల 11న నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది.కాగా.. ఇదే పథకం ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఆ అమ్మ ఒడి సొమ్ము కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన అనంతగిరి లో చోటుచేసుకుంది.

గుమ్మకోట పంచాయితీ బురదగడ్డె గ్రామానికి చెందిన తామల దేముడమ్మ,భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మ ఒడి సొమ్ము ఇటీవల దేముడమ్మ బ్యాంకు ఖాతాలో పడింది.అంతే ఆ డబ్బు మీద ఆశతో కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా  హతమార్చాడు .ఐతే తాగుడుకి బానిసైన భర్త భీమన్న., డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు దేవుడమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే రోజు గుమ్మకోట సంతకు వెళ్లిన సమయంలోనూ డబ్బులు డ్రా చేయాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో.. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

అయితే   డబ్బులు డ్రా చేయాలని  ఎంత చెప్పినా భార్య ఒప్పుకోకపోవడంతో..సంత నుంచి ఇంటికి వెళ్లే దారిలో పొలాల వద్ద  కాపు కాచి  ఆమెను బండరాయితో మోది దారుణంగా    హత్య చేశాడు ఆ  కసాయి   భర్త.తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అమ్మఒడి సొమ్ము విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయాన్ని పిల్లలు, స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా భీమన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తొలుత నిందితుడు తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 


నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>