HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covishield7b8f2167-f019-4f2b-afdf-c23c68d8732b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covishield7b8f2167-f019-4f2b-afdf-c23c68d8732b-415x250-IndiaHerald.jpg ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా ‘కొవిషీల్డ్‌’ను ఉత్పత్తిచేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తొలి విడత డోస్‌లను తరలించింది. పుణేలోని ఉత్పత్తి కేంద్రం నుంచి మూడు ప్రత్యేక వాహనాల ద్వారా కట్టుదిట్టమైన భద్రత నడుమ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని 13 ప్రధాన నగరాలకు సరఫరా చేశారు.తొలి విడతలో ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు టీకా డోస్‌లను తరలించారు covishield;delhi;india;vijayawada;guwahati;narendra modi;january;prime minister;chennai;central government;pune;indigo airlines;lucknow;manadesamకోవిషీల్ద్ వ్యాక్సిన్ పూణే నుండి 13 నగరాలకు తరలింపుకోవిషీల్ద్ వ్యాక్సిన్ పూణే నుండి 13 నగరాలకు తరలింపుcovishield;delhi;india;vijayawada;guwahati;narendra modi;january;prime minister;chennai;central government;pune;indigo airlines;lucknow;manadesamTue, 12 Jan 2021 12:15:00 GMTఇండియా తొలి విడత డోస్‌లను తరలించింది. పుణేలోని ఉత్పత్తి కేంద్రం నుంచి మూడు ప్రత్యేక వాహనాల ద్వారా కట్టుదిట్టమైన భద్రత నడుమ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని 13 ప్రధాన నగరాలకు సరఫరా చేశారు.


జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించగా.. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం. తొలి విడతలో ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు టీకా డోస్‌లను తరలించగా.. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, రెండు కార్గో విమానాలను వినియోగించారు. తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లినట్టు టీకాల తరలింపు ప్రక్రియలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా టీకా డోసులను సరఫరా చేస్తున్నారు. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌కు చెందిన విమానాలను ఉపయోగించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు జనవరి 16 నుంచి శ్రీకారం చుడుతున్నారు. తొలి విడతలో మూడు కోట్ల మంది వైద్య ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.


 తర్వాత 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి టీకా అందజేయనున్నారురు. తొలివిడతలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా ఖర్చును కేంద్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి 1.1 కోట్ల డోసులను, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల డోసులను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లోగా మరో 4.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను కొనుగోలు చేయనున్నారు. మొత్తం 6 కోట్లకుపైగా డోసులను కొనుగోలు చేస్తోంది. సీరం సంస్థ ఒక్కో కొవిషీల్డ్‌ డోస్‌ను రూ.200కు విక్రయిస్తుండగా, రూ.10 మేర జీఎస్‌టీ అదనం.. కొవాగ్జిన్‌కు ఒక్కో డోసుకు రూ.295 చెల్లించనున్నట్లు సమాచారం.


క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>