PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/doctor5431ce87-97fb-4f1c-9f30-ed3e1e6b914c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/doctor5431ce87-97fb-4f1c-9f30-ed3e1e6b914c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ డిప్లమో కోర్సులకు ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరాలకు 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు గానూ నిర్ధారించిన ఫీజులు వర్తిస్తాయని వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిర్దేశించిన వార్షిక ఫీజులో ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు జారీకి, క్రీడలు, సాంస్కృతి అంశాలు, కంప్యూటర్ ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలు ఇమిడి ఉంటాయని రాష్ట్ర ప్రmbbs;kumaar;anil music;jagan;andhra pradesh;kadapa;scheduled caste;kurnool;vishakapatnam;kanna lakshminarayana;2020;doctor;anil kumar singhalఏపీలో డాక్టర్ చదువుతారా...?ఏపీలో డాక్టర్ చదువుతారా...?mbbs;kumaar;anil music;jagan;andhra pradesh;kadapa;scheduled caste;kurnool;vishakapatnam;kanna lakshminarayana;2020;doctor;anil kumar singhalTue, 12 Jan 2021 19:08:22 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ డిప్లమో కోర్సులకు ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరాలకు 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు గానూ నిర్ధారించిన ఫీజులు వర్తిస్తాయని వైద్యారోగ్యశాఖ  ప్రకటన విడుదల చేసింది. నిర్దేశించిన వార్షిక ఫీజులో ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు జారీకి, క్రీడలు, సాంస్కృతి అంశాలు, కంప్యూటర్  ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలు ఇమిడి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కన్వీనర్ కోటా కింద బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు ఫీజుల్లో హాస్టల్ , మెస్ ఛార్జీలు, రవాణా లాంటి ఖర్చులు ఇమిడి ఉండవని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా అదనపు మొత్తాలను కళాశాల యాజమాన్యాలు వసూలు చేసేందుకు లేదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. చిత్తూరు, కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని నర్సింగ్ కళాశాల్లో కన్వీనర్ కోటా కింద 18 వేలు ఫీజుగా నిర్ధారించారు.

ఈ జిల్లాల్లో బీఎస్సీ నర్సింగ్ ఫీజును మేనేజ్ మెంట్ కోటా కింద 80 వేల రూపాయలుగా నిర్ధారించింది రాష్ట్ర ప్రభుత్వం.  ఎంఎస్సీ నర్సింగ్ కోసం కర్నూలులోని కళాశాలలో కన్వీనర్ కోటా కింద 83 వేలు, మేనేజ్మెంట్ కోటా కింద 1 లక్షా 49 వేలుగా ఫీజు నిర్ధారించారు. బ్యాచిలర్ అఫ్ ఫిజియో థెరపీ(బీపీటీ) కోర్సుకు ఒంగోలు జిల్లాలోని కళాశాలలో కన్వీనర్ కోటా కింద 18 వేలు, మేనేజ్మెంట్ కోటా కింద 80 వేల రూపాయలు పీజుగా నిర్ధారించింది ఏపీ సర్కార్. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ విషయంలో సిఎం వైఎస్ జగన్ ప్రతీ ఒక్కటి కూడా  జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు.


డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తొలగించడం వల్ల ట్విటర్ కు ఎంత నష్టం వచ్చిందో తెలుసా..!!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>