PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsc1074343-4802-487c-a4fa-4d6de711717a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsc1074343-4802-487c-a4fa-4d6de711717a-415x250-IndiaHerald.jpgదీంతో ఎన్నికల వాయిదా పై జగన్ ప్రభుత్వం హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఈ కేసుపై ఇవాళ హైకోర్ట్ లో విచారణ తోపాటు, తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు నుండి సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందా..అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళతాయి. latest news;kumaar;suma;suma kanakala;tara;jagan;high court;government;panchayati;court;letter;local languageఎన్నికల వాయిదా,నిర్వహణ.. రెండు సంచలనమే.. మరి తీర్పు ఏంటి !!ఎన్నికల వాయిదా,నిర్వహణ.. రెండు సంచలనమే.. మరి తీర్పు ఏంటి !!latest news;kumaar;suma;suma kanakala;tara;jagan;high court;government;panchayati;court;letter;local languageMon, 11 Jan 2021 09:00:00 GMTఏపీలో స్థానిక ఎన్నికపై వివాదం ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రం లో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మద్య వివాదం తార స్థాయికి చేరింది. గత ఏడాది కాలంగా పంచాయతీ ఎన్నికల పై రగడ జరుగుతూనే ఉంది. పలుమార్లు హైకోర్ట్ జోక్యం చేసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపింది. అయిన అటు ఎన్నికల కమిషన్ గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని స్థానిక ఎన్నికల పై మొండి వైకరి చూపుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో స్థానిక ఎన్నికలపై కచ్చితంగా తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తో ఇటీవల చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ కు సూచించిన కొద్ది గంటల్లోనే భేటీ అనంతరం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఒక్కసారిగా సంచలనం రేపారు.

దీంతో ఎన్నికల వాయిదా పై జగన్ ప్రభుత్వం హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఈ కేసుపై ఇవాళ హైకోర్ట్ లో విచారణ తోపాటు, తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు నుండి  సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందా..అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళతాయి.

మరి అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చెయ్యడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అయ్యింది. ఇక దర్మాసనం లో ఎలాంటి తీర్పు వచ్చినా అదొక చరి త్ర అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఇంత వరకు చరిత్రలోనే జరగలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు ఆదేశిస్తే.. అది సంచలనమే అవుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. అలా కాకుండా స్థానిక ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్‌ఈసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే.. ఇందుకు సుముఖంగా లేని ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది. ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ చేస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.


తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>