PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpgకేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం 39 రోజులు దాటింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ వైపు 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎముకలు కొరికే చలి, మరోవైపు జోరు వర్షంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. వారేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు అని... న్యాయమైన డిమాండ్లనే ఆమోదించమంటున్నారు అన్నారు. ఎమ్మెస్పీని చట్టబద్ధం చేయడం న్యాయం అని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను యథాతధంగా కొనసాగిస్తూ మరింత పటిష్టం చేయాలి అని డిమాండ్ చేసారు.somireddy chandramohanreddy,tdp,bjp,ap;amit shah;varsha;narendra modi;minister;vegetable market;tdp;central government;chandramohan reddy somireddy;reddy;varsham;narendraబిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూబిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూsomireddy chandramohanreddy,tdp,bjp,ap;amit shah;varsha;narendra modi;minister;vegetable market;tdp;central government;chandramohan reddy somireddy;reddy;varsham;narendraMon, 04 Jan 2021 15:10:00 GMTమంత్రిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ వైపు 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎముకలు కొరికే చలి, మరోవైపు జోరు వర్షంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. వారేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు అని... న్యాయమైన డిమాండ్లనే ఆమోదించమంటున్నారు అన్నారు. ఎమ్మెస్పీని చట్టబద్ధం చేయడం న్యాయం అని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను యథాతధంగా కొనసాగిస్తూ మరింత పటిష్టం చేయాలి అని డిమాండ్ చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో 60 శాతంపైన రైతులు మార్కెట్ యార్డుల ద్వారానే పంటను అమ్ముకుంటున్నారు అని, మార్కెట్ యార్డుల్లో ఒక వ్యవస్థ ఉంది అని అన్నారు. ఒక పర్యవేక్షణ ఉంది అని పేర్కొన్నారు. మోసాలకు తావులేకుండా సాగిపోతోంది అని ఆయన వెల్లడించారు. రైతుల దగ్గర కంపెనీలు ఒప్పందం చేసుకుంటే ఎమ్మెస్పీకి పైబడి జరగాలనేది కూడా న్యాయమైన కోరికే అని ఆయన వెల్లడించారు. రైతులు పండించే పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఎప్పటినుంచో ఉంది అని అన్నారు.

బడా కంపెనీలకు పరిమితి లేకుండా నిల్వలు చేసుకునే సౌలభ్యం ఇవ్వడంతో అంతిమంగా పేదలపై ధరల ప్రభావం పడుతుంది అని పేర్కొన్నారు. పెద్దపెద్ద కంపెనీలు వచ్చి లక్షల టన్నులు నిల్వ చేసుకుని మార్కెట్ లో కొరత వచ్చాక ధరలు పెంచితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రస్టేజీకి పోకుండా ఒక మెట్టు దిగి రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే దేశమంతా మిమ్మల్ని అభినందిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పట్టింపులతో మొండికి పోయి రైతులకు అన్యాయం చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అన్నారు. దేశంలో 60 శాతం మంది రైతులు, వ్యవసాయ కూలీలే...వీరి విషయంలో ఇంత మొండి వైఖరి తగదు అని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు ఈ మధ్య సైలెంట్ గా ఉంటే సోమిరెడ్డి బిజెపిని విమర్శించడం గమనార్హం.


న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>