PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgపదిమందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ బాగుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండటం విషాదకరమన్నారు చంద్రబాబు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదంటారని పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. chandrababu naidu;jagan;amaravati;andhra pradesh;government;chief minister;tdp;ycpరైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు! జగన్ పై చంద్రబాబు ఫైర్రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు! జగన్ పై చంద్రబాబు ఫైర్chandrababu naidu;jagan;amaravati;andhra pradesh;government;chief minister;tdp;ycpWed, 23 Dec 2020 19:01:59 GMTటీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదిమందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ బాగుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండటం విషాదకరమన్నారు చంద్రబాబు.  ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదంటారని పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. ప్రజారాజధాని అమరావతి కోసం రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని ఈ సందర్భంగా  టీడీపీ అధినేత గుర్తు చేశారు. వీరిలో 110 మందికిపైగా అన్నదాతలు అమరులయ్యారన్నారు చంద్రబాబు.

ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయబోతోందని చంద్రబాబు మండిపడ్డారు. వరదలు, భారీ వర్షాలు, నివర్‌ తుపాను విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టే వరకు పంట బీమా ప్రీమియం కట్టలేదంటే రైతుల పట్ల పాలకులకెంత నిర్లక్ష్యమో అర్థమవుతోందన్నారు టీడీపీ అధినేత.  రైతుకు పరిహారం అడిగితే సభలో తమపై ఎదురుదాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై మాట్లాడకుండా తమను సస్పెండ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఏపీలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పిన చంద్రబాబు.. ఇకనైనా పాలకులు తీరు మార్చుకుని పంటకు గిట్టుబాటు ధరలు అందించాలని కోరారు.  పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పాలని, రైతుల బకాయిలను తక్షణమే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందించాలని  ప్రభుత్వానికి సూచించారు. సబ్సిడీ ఇచ్చి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు చంద్రబాబు.రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు చంద్రబాబు.





మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>