PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajasingh3ce23083-177f-429a-ae51-8e0a205e10a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajasingh3ce23083-177f-429a-ae51-8e0a205e10a5-415x250-IndiaHerald.jpgతెలంగాణ పోలీసులు, బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తనపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. మీ పరిధిలోని పీఎస్‌ల ముందు నుంచి ఎన్ని గోవులు తరలిస్తున్నారో తెలుసుకోవాలని సీపీకి సూచించారు. తాను చెప్పేది తప్పైతే తనపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన వ్యాఖ్యలు నిజమైతే పోలీసులపై చర్యలు తీసుకుంటారా అని సీపీని ప్రశ్నించారు రాజా సింగ్.rajasingh;raja;bharatiya janata party;maharashtra - mumbai;telangana;police;mla;maharashtra;war;cow slaughter;fashion;shamshabad;choutuppalసజ్జనార్, రాజా సింగ్ మధ్య డైలాగ్ వార్సజ్జనార్, రాజా సింగ్ మధ్య డైలాగ్ వార్rajasingh;raja;bharatiya janata party;maharashtra - mumbai;telangana;police;mla;maharashtra;war;cow slaughter;fashion;shamshabad;choutuppalTue, 22 Dec 2020 20:14:26 GMTబీజేపీ ఎమ్మెల్యే  రాజా సింగ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తనపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై  రాజాసింగ్  స్పందించారు. మీ పరిధిలోని పీఎస్‌ల ముందు నుంచి ఎన్ని గోవులు తరలిస్తున్నారో తెలుసుకోవాలని సీపీకి సూచించారు. తాను చెప్పేది తప్పైతే తనపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన వ్యాఖ్యలు నిజమైతే పోలీసులపై చర్యలు తీసుకుంటారా అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజా సింగ్.

           
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు సైబరాబాద్  సీపీ  సజ్జనార్ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం అందరికి ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీ తప్పుబట్టారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై లీగల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ తెలిపారు

సోమవారం రాత్రి మహారాష్ట్ర నుంచి హైదారాబాద్‌లోని బహుదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీ రాజా సింగ్ పట్టుకున్నారు. 45 ఆవులతో శంషాబాద్ మీదుగా వెళ్తున్న లారీని చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద రాజాసింగ్ అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన రాజా సింగ్ ..‘కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఈ సంఘటనపై డీజీపీ స్పందించాలి. ఆవులు, ఎద్దులను వధించటం నేరం. గోవధపై బహుదూర్ పుర మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదు. ఒకవేళ అధికారులు స్పందిచకపోతే మేమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చారు. కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకుని పీఎస్‌లకు తీసుకువస్తే పోలీసులు అసభ్యకరంగా తిడుతున్నారని రాజా సింగ్ వాపోయారు.

---

 


పవన్ దూరం...బ్రదర్స్ దగ్గర...?

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? ఢిల్లీకి కోమటిరెడ్డి!

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రెడీ ?

రకుల్‌కు కరోనా.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>