PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-worries-about-power-outages0a3b800a-a6e8-43cc-9d34-cff44ba45482-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-worries-about-power-outages0a3b800a-a6e8-43cc-9d34-cff44ba45482-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌కు అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుంది. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద డేటా సెంటర్స్ ను.. నగరంలోని మూడు చోట్ల నిర్మించనుంది అమెజాన్‌. వీటికి అంతరాయం లేకుండా కరెంట్ ను అందించబోతోంది విద్యుత్‌శాఖ. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ ఎస్పీడీసీఎల్. ఒక దగ్గర కరెంటు పోతే మరో దగ్గరి నుంచి విద్యుత్‌ను అందించేలా లైన్లు వేస్తోంది ట్రాన్స్ కో. no worries about power outages;raghu;vidya;hyderabad;district;cm;mandalam;electricity;ranga reddyకరెంట్ పోతుందనే దిగులే లేదు..!కరెంట్ పోతుందనే దిగులే లేదు..!no worries about power outages;raghu;vidya;hyderabad;district;cm;mandalam;electricity;ranga reddyMon, 21 Dec 2020 23:00:00 GMT
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద డేటా సెంటర్లు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుండటంతో విద్యుత్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఫ్యాబ్‌సిటీ, షాబాద్‌ మండలం చందనవెల్లి, కందుకూరు మండలంలోని ముచ్చర్లలోని ఫార్మాసిటీలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు టీఎస్‌ఐఐసీ 134 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

నిర్మాణ పనుల దృష్ట్యా విద్యుత్‌శాఖ అధికారులు మూడు డేటా సెంటర్లకు మూడు తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేసినట్లు ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. తాత్కాలిక విద్యుత్‌ సరఫరా కోసం 31.65 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రావిర్యాలలోని ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌కు అదే ప్రాంతంలోని ఫ్యాబ్‌సిటీ సబ్‌స్టేషన్‌ నుంచి 2 కిలోమీటర్ల మేర ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఏర్పాట్లల్లో భాగంగా మామిడిపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి 10 కిలోమీటర్ల ఓవర్‌ హెడ్‌లైన్‌, మరో ఒక కిలోమీటర్ అండర్ గ్రౌండ్ లైన్‌ను వేయనున్నారు. ఇందు కోసం 7.4 కోట్ల రూపాయలను వెచ్చించబోతుంది ట్రాన్స్ కో.


ముచ్చర్లలోని ఫార్మాసిటీలో ఏర్పాటు అవుతున్న మరో డేటా సెంటర్‌కు తక్కళ్లపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి 26 కిలోమీటర్ల మేర ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్‌ వేయనున్నారు. ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఫ్యాబ్‌సిటీ సబ్‌స్టేషన్‌ నుంచి 28 కిలోమీటర్ల ఓవర్‌హెడ్‌ లైన్‌ను వేయబోతున్నారు. ఇందుకోసం 29.7 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. షాబాద్‌ మండలంలోని చందనవెళ్లిలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు చేగూరు సబ్‌స్టేషన్‌ నుంచి 15 కిలోమీటర్ల ఓవర్‌హెడ్‌లైన్‌, ప్రత్యామ్నాయంగా శ్రీరంగాపూర్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి 24.1 కిలోమీటర్ల ఓవర్‌ హెడ్‌లైన్‌ను వేయనున్నారు. ఇందుకోసం 21.3 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.




గద్దలకొండ బాక్సర్ ఎప్పుడొస్తాడు..?

కమల్ స్పీడ్ పెంచాడు.. ఎన్నికల హామీలు ప్రకటించేశాడు

బిగ్‌బాస్ 4: నాగార్జున రెమ్యునరేషన్ అంతా..? కుర్ర హీరోతో సమానంగా!

జమిలికి రెడీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన!

చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!

బాలయ్య రావిపూడి కాంబో ఫిక్స్...?

పీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>