PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-kcr-phone-call-to-ap-farmer291447cc-c25c-40ec-ab12-dc6deee9d3de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-kcr-phone-call-to-ap-farmer291447cc-c25c-40ec-ab12-dc6deee9d3de-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఆదర్శ రైతుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుతో మాట్లాడి సీడ్రిల్‌ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై రైతును అడిగి తెలుసుకున్నారు. kcr call farmer;kcr;ghantasala;jeevitha rajaseskhar;hyderabad;telangana;smart phone;cm;chief ministerఆంధ్ర ఆదర్శ రైతుకు కేసీఆర్ ఫోన్! లంచ్ కు రావాలని ఆహ్వానంఆంధ్ర ఆదర్శ రైతుకు కేసీఆర్ ఫోన్! లంచ్ కు రావాలని ఆహ్వానంkcr call farmer;kcr;ghantasala;jeevitha rajaseskhar;hyderabad;telangana;smart phone;cm;chief ministerSun, 20 Dec 2020 09:24:55 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుతో మాట్లాడి సీడ్రిల్‌ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై రైతును అడిగి తెలుసుకున్నారు. 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి సన్నరకం వరి సాగుచేసిన ప్రసాదరావు, ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి సాధించినట్టు వెల్లడించారు. దీంతో రైతు ప్రసాదరావును అభినందించిన కేసీఆర్ ఒకసారి హైదరాబాద్ రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని  ఆంద్ర ఆదర్శ అన్నదాతను కేసీఆర్  కోరారు.

ఆదర్శరైతు ఉప్పల ప్రసాదరావుకు శనివారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. సీడ్రిల్‌ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై రైతు ప్రసాదరావును ఆయన అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్‌ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని.. 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు తెలంగాణ సీఎంకు తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుకు కేసీఆర్‌ ఆహ్వానం పలికారు. కేసీఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో ప్రసాదరావును పలువురు రైతులు అభినందించారు.    

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఫోన్ చేసి అభినందించడంతో ఆదర్శ రైతు సంతోషానికి అవధులు లేవు. కష్టాలను అధిగమిస్తూ జీవితంలో ఒక్కో మెట్టు పైకెక్కారు ఉప్పల ప్రసాదరావు. గత 32 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ప్రసద రావు.. రెండు ఎకరాలు, రెండు గేదెలతో తన సాగు ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం ఇది 200 ఎకరాలయ్యింది. 1982లో చదువుకుంటూనే మొదట వ్యవసాయం మొదలుపెట్టారు. తండ్రిని ఒప్పించి వ్యవసాయంవైపు అడుగులు వేశారు. ఎంతో శ్రమించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. వ్యవసాయం, పశుపోషణ అనుబంధంగా సాగిస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతితో గడ్డి పండించి, పశువులకు వేయడం వల్ల దిగుబడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆంధ్రా ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు.




పోర్న్ వీడియోలు డిలీట్ చేసిన పేరెంట్స్.. కేసు వేసిన కొడుకు.. పేరెంట్స్ కి శిక్ష..?

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>