PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan329d1215-5625-4e11-ae3c-282c8fe2826f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan329d1215-5625-4e11-ae3c-282c8fe2826f-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పేదలు అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పేదలకు ఇంటి పట్టాల పథకంపై తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ పథకం కింద అర్హులు అందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని జగన్ సర్కారు భావిస్తోందిjagan;amala akkineni;editor mohan;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;district;chief minister;2020;good news;sv mohan reddy;reddy;good newwzఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్!ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్!jagan;amala akkineni;editor mohan;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;district;chief minister;2020;good news;sv mohan reddy;reddy;good newwzSat, 19 Dec 2020 17:03:18 GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పేదలకు ఇంటి పట్టాల పథకంపై తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ పథకం కింద అర్హులు అందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. దీని కోసం ప్రతి జిల్లాలో భూములు సేకరిస్తూ వస్తోంది. పట్టాల పంపిణీ జరగ బోతోందంటూ చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇది ఎప్పటి కప్పుడు వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు తాజాగా పేదల ఇళ్ల పట్టాల పథకం అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 935 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఓ వార్త బయటకు వచ్చింది.

935 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా విభాగం నుంచి అనుమతి వచ్చిందిట. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు, తదితర అవసరాల కోసం ఈ  సొమ్మును రెవెన్యూ శాఖ  విడుదల చేసిందని సమాచారం. ఈ డబ్బు మొత్తం సీసీఎల్ఏ విధానం ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందింది. పేదల ఇళ్ల పట్టాల పథకం కోసం చేసిన భూసేకరణ స్థలాలకు చెల్లింపులు చేయడం కోసమే ఈ సొమ్ము పంపుతున్నట్లు రెవెన్యూ శాఖ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా అందాయి. వైఎస్ఆర్ గృహ వసతి పథకంలో భాగంగా 2020 - 21 ఆర్థిక సంవత్సరం కోసం ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు  ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకం కోసం విడుదల చేసిన 935 కోట్ల రూపాయల నిధుల్లోనే 88.92 కోట్ల రూపాయలను నిర్వహణా వ్యయం కోసం ఖర్చు చేయబోతున్నారు. ఈ వార్త సొంతింటి కోసం ఎదురు చూసే చాలా మంది పేదవాళ్లకు సంతోషం కలిగిస్తోంది.


వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన మంచు లక్ష్మి కూతురు

పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>