PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rrr1eb07e69-4358-4077-a04b-492167904be6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rrr1eb07e69-4358-4077-a04b-492167904be6-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకల కోసం పార్టీ నేతలు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల నుంచి వసూలు చేసే ఈ జే టాక్స్‌ను ఆపాలని వ్యాఖ్యానించారు.raghurama krishnamaraju;editor mohan;krishna;raghu;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;mp;chief minister;ycp;sv mohan reddy;reddy;partyసీఎం జగన్ పుట్టినరోజు విషయమై రెబల్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!సీఎం జగన్ పుట్టినరోజు విషయమై రెబల్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!raghurama krishnamaraju;editor mohan;krishna;raghu;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;mp;chief minister;ycp;sv mohan reddy;reddy;partySat, 19 Dec 2020 22:30:00 GMT2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి  గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకల కోసం పార్టీ నేతలు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల నుంచి వసూలు చేసే ఈ జే టాక్స్‌ను ఆపాలని వ్యాఖ్యానించారు.



కరోనా సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల నుంచి వ్యాపారులను కాపాడండి అని ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపీ రఘురామ కోరారు. మీ పుట్టిన రోజు వేడుకల కోసం సొంత డబ్బు గానీ ప్రభుత్వం డబ్బు కానీ వాడండి అంతేకానీ వ్యాపారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల వల్ల పార్టీ పరువు, మీ పరువు పోయే ప్రమాదం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జగన్ బర్త్ డే కోసం చేస్తున్న వసూళ్ల వల్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రఘురామ అన్నారు. చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి పుట్టిన రోజు వేడుకల పేరుతో నేతల చేస్తున్న డబ్బులు వసూలు కార్యక్రమం ఆపండి అని రఘురామ కృష్ణరాజు అన్నారు.


టీమ్‌ఇండియాకు మరో షాక్‌

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>