PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bad-news-for-telangana-govt-employees064a874c-93aa-45ee-b092-44941058ab36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bad-news-for-telangana-govt-employees064a874c-93aa-45ee-b092-44941058ab36-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధికంగా 43 శాతం ఫిట్‌ మెంట్‌ ప్రకటించింది. ఇక రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2018 మే 18న ఉద్యోగులకోసం తొలి వేతన సవరణ కమిషన్‌ (పి.ఆర్.సి.) ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ నివేదిక ఆలస్యం కావడంతో గడువు పెంచుకుంటూ పోయారు. ఇలా పెంచుకుంటూ పోయిన ఆఖరి గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పి.ఆర్.సి.ని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పీఆర్‌సీ ప్రక్రియనుtelangana employees;kcr;amala akkineni;telangana rashtra samithi trs;telangana;chief ministerతెలంగాణ ఉద్యోగులకు నిరాశేనా..?తెలంగాణ ఉద్యోగులకు నిరాశేనా..?telangana employees;kcr;amala akkineni;telangana rashtra samithi trs;telangana;chief ministerWed, 16 Dec 2020 08:00:00 GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధికంగా 43 శాతం ఫిట్‌ మెంట్‌ ప్రకటించింది. ఇక రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2018 మే 18న ఉద్యోగులకోసం తొలి వేతన సవరణ కమిషన్‌ (పి.ఆర్.సి.) ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ నివేదిక ఆలస్యం కావడంతో గడువు పెంచుకుంటూ పోయారు. ఇలా పెంచుకుంటూ పోయిన ఆఖరి గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పి.ఆర్.సి.ని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పీఆర్‌సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో ఈ అంశం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉద్యోగ సంఘాలు గతంలో కంటే ఎక్కువ ఫిట్ ‌మెంట్ ‌తో పి.ఆర్.సి.ని ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆదాయం తగ్గుదల, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్మయం వెలువరుస్తుందని తెలుస్తోంది. అంటే.. ఈసారి ఫిట్ మెంట్ ఎక్కువ ఆశించలేరు. ఇది ఒకరకంగా తెలంగాణ ఉద్యోగులకు నిరాశే.

సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వేతన సవరణను, ఇతర నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించడం ఆనవాయితీ. దీనినే ఈసారీ కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. వేతన సవరణపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించనున్నారు. ప్రగతిభవన్‌ నుంచి వారికి త్వరలో పిలుపు అందుతుంది. పి.ఆర్.సి. సన్నద్ధతపై సీఎం కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు తాజాగా సమాచారం అందింది. దీంతో అది వివిధ రకాలుగా కసరత్తు చేసి అతి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాలు ఎంత మేరకు పెంచాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని, బడ్జెట్‌లో దానిని చేర్చుతారని తెలుస్తోంది.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>