PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/news-of-cm-jagans-visit-to-delhi202a0a26-5b0d-47bc-a654-3d9294c5401c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/news-of-cm-jagans-visit-to-delhi202a0a26-5b0d-47bc-a654-3d9294c5401c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చలు జరిపారు. మూడు రాజధానుల అంశం అమిత్ షాతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీలు..తుఫాన్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. news of cm jagans visit to delhi;amit shah;delhi;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;amith shah;2019;high court;kurnool;survey;minister;central governmentసీఎం జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు..!సీఎం జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు..!news of cm jagans visit to delhi;amit shah;delhi;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;amith shah;2019;high court;kurnool;survey;minister;central governmentWed, 16 Dec 2020 17:00:00 GMTఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చలు జరిపారు. మూడు రాజధానుల అంశం అమిత్ షాతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీలు..తుఫాన్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్.    

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీలో అధికార వికేంద్రీకరణ.. మూడు రాజధానుల అంశం అమిత్ షా దగ్గర ప్రస్తావించారు సీఎం జగన్. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ ఆగస్టులో చట్టం కూడా చేశామని గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్‌ చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనికోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని గుర్తుచేశారు సీఎం జగన్.

ఇక..పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి వినతిపత్రం అందించారు. రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌ ప్రకారం 2017-18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే 55 వేల 656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలన్నారు సీఎం జగన్. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలను రీయింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందని వెల్లడించారు ఏపీ సీఎం జగన్.

మరోవైపు..ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు సీఎం జగన్. సమగ్ర భూ సర్వేకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్‌ టైటలింగ్‌ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌ 21న సమగ్ర సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని కోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని.. వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ కాలేజీలు చాలా కీలమని హోంమంత్రికి వివరించారు.

తగిన విధంగా సాయం అందించాలని కోరారు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన వర్షాల కారణంగా పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన చేసిందని స్పష్టంచేశారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. నివర్‌ తుఫాను తర్వాత పంట నష్టం అంచనా కోసం కేంద్రం తరఫున బృందాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. త్వరగా రాష్ట్రంలో పర్యటించి నష్టంపై లెక్కలు తయారుచేసి కేంద్రానికి సమర్పించాల్సి ఉందని హోంమంత్రి అమిత్‌ షాకు వివరించారు సీఎం జగన్.




కరెక్ట్ టైంలో అరియానాకు దేవి నాగవల్లి సపోర్ట్..!

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>