PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics-around-delhi33f79017-7a43-443d-b9db-c662c6a54008-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics-around-delhi33f79017-7a43-443d-b9db-c662c6a54008-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొంత మంది టిఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేసింది అని ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొంతమంది నేతలు మాత్రం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారని వ్యాఖ్యలు వినిపించాయి. భారతీయ జనతా పార్టీ ఎవరినైతే టార్గెట్ చేసే అవకాశం ఉన్నాయో వారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే భవిష్యత్ పరిణామాలు అనవసరంగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని అవినీతి వ్యవహారం లో ఉన్న మంత్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొbjp,trs,cbi,ts;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;smart phone;court;cbi;party;mantraతెరాస మీద సిబిఐ విచారణ దిశగా బిజెపి...?తెరాస మీద సిబిఐ విచారణ దిశగా బిజెపి...?bjp,trs,cbi,ts;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;smart phone;court;cbi;party;mantraTue, 15 Dec 2020 15:45:00 GMTబీజేపీ గాలం వేసింది అని ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొంతమంది నేతలు మాత్రం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారని వ్యాఖ్యలు వినిపించాయి. భారతీయ జనతా పార్టీ ఎవరినైతే టార్గెట్ చేసే అవకాశం ఉన్నాయో వారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే భవిష్యత్ పరిణామాలు అనవసరంగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని అవినీతి వ్యవహారం లో ఉన్న మంత్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని సీఎం కేసీఆర్ వారికి సూచనలు చేశారు.

దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారని ఈ మధ్యకాలంలో చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుందని సమాచారం. కొంతమంది నేతలు అవినీతి వ్యవహారాలతో పాటు భూ అక్రమాల్లో కూడా ఎక్కువగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ గుర్తించింది. దీంతో వారి మీద అవసరం అయితే సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేసే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందని ఈ మేరకు కోర్టులో కేసు కూడా వేయడానికి రెడీ అవుతుందని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు మీద కొన్ని ఆరోపణలు ఎక్కువగా రావడంతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒక ఎంపీ మీద కూడా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేయడంతో టిఆర్ఎస్ పార్టీ కాస్త అప్రమత్తమైంది. అవినీతి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలు సీరియస్ గా  లేకపోతే మాత్రం పార్టీ నష్టపోతుందని సీఎం కేసీఆర్ వారి ముందు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించనున్నారు.


పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>